ఒంగోలులో వైఎస్ విగ్రహం ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు
సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా వైఎస్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారంటూ.. పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ హైకోర్టుకు తెలిపారు.
ఒంగోలులో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఏర్పాటు మీద హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను డాక్టర్ రాజ్ విమల్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా వైఎస్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారంటూ.. పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ హైకోర్టుకు తెలిపారు.
నిబంధనలు స్పష్టంగా ఉన్నా రోడ్డు మధ్యలో విగ్రహం ఎలా ఏర్పాటు చేస్తారని, విగ్రహం ఏర్పాటు చేయవద్దంటూ స్టే హైకోర్టు ఇచ్చింది. పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు.