మనం వేసే ప్రతి అడుగు ప్రజలకు దగ్గరగా ఉండాలని  వైసీపీ ప్రజా ప్రతినిధులకు ఆ పార్టీ చీఫ్, ఏపీ సీఎం వైఎస్ జగన్ సూచించారు. పేదల సంక్షేమం కోసం పాలనలో మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.


అమరావతి: మనం వేసే ప్రతి అడుగు ప్రజలకు దగ్గరగా ఉండాలని వైసీపీ ప్రజా ప్రతినిధులకు ఆ పార్టీ చీఫ్, ఏపీ సీఎం వైఎస్ జగన్ సూచించారు. పేదల సంక్షేమం కోసం పాలనలో మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అమరావతిలోని తన నివాసంలో వైఎస్‌ఆర్‌సీఎల్పీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో వైఎస్ జగన్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులకు దిశా నిర్ధేశం చేశారు. రాష్ట్రం మొత్తం మనవైపే చూస్తోందన్నారు.అవినీతికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదన్నారు. చంద్రబాబునాయుడు పాలనలో దోచుకొన్నారని ఆయన ఆరోపించారు.

ఏ మాత్రం అవినీతికి అవకాశం ఉండకూడదని జగన్ సూచించారు. ప్రమాణస్వీకారం నుండి పారదర్శకతకే ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా ఆయన చెప్పారు.