Asianet News TeluguAsianet News Telugu

వైఎస్సార్‌కు ఘన నివాళి అర్పించిన వైఎస్‌ భారతి

వైఎస్సార్‌ జిల్లా : ఇడుపులపాయలో దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్‌ ఘాట్ వద్ద  వైఎస్‌ భారతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 

YS Bharathi pays  tribute to YSR - bsb
Author
Hyderabad, First Published Jul 8, 2021, 12:52 PM IST

 వైఎస్సార్‌ జిల్లా : ఇడుపులపాయలో దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్‌ ఘాట్ వద్ద  వైఎస్‌ భారతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 

వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.  రాజంపేట మండలంలో రైతు దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి, రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యే కార్యాలయంలో పార్టీ జెండాను ఎగురవేశారు.

కాగా, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని కడప జిల్లాలోని ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద షర్మిల గురువారం నాడు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.వైఎస్ షర్మిల గురువారం నాడు తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేయనున్నారు. 

పార్టీ ఏర్పాటును పురస్కరించుకొని హైద్రాబాద్ నుండి ఆమె నిన్న రాత్రే ఇడుపులపాయకు చేరుకొన్నారు. ఇవాళ ఉదయం వైఎస్ఆర్ సమాధి వద్ద ఆమె నివాళులర్పించారు. షర్మిలతో పాటు ఆమె భర్త అనిల్ కుమార్, తల్లి  వైఎస్ విజయమ్మ, వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత  తదితరులు  వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు. వైఎస్ఆర్ సమాధి వద్ద తెలంగాణలో ఏర్పాటు చేసే పార్టీ జెండాను ఉంచి ఆమె ప్రార్ధనలు చేశారు. 

ఇవాళ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో వైఎస్ షర్మిల  హైద్రాబాద్ కు చేరుకొంటారు. పంజాగుట్టలో వైఎస్ఆర్ విగ్రహనికి పూలమాల వేసి రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించే సమావేశంలో ఆమె పాల్గొంటారు.  ఈ సమావేశంలో పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. పార్టీ ఏర్పాటు వెనుక ఉద్దేశ్యాలు,  ఎజెండాపై ఆమె ప్రసంగిస్తారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios