చంద్రబాబు నాయుడు, లోకేష్ ల మీద మరోసారి విరుచుకుపడ్డారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. ఆదాన్ కంపెనీ గురించి అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లైందని ఎద్దేవా చేశారు.
తాడేపల్లి : వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ వి.విజయసాయిరెడ్డి టీడీపీపై విరుచుకుపడ్డారు. నెల రోజులుగా టీడీపీ పనికిమాలిన చర్చ పెట్టిందని మండిపడ్డారు. ఆడాన్ అనే కంపెనీ మాది అని దుష్ప్రచారం చేస్తున్నారు. చెప్పిన అబద్దం మళ్లీ మళ్లీ చెప్తే నిజమై పోతుందని వాళ్ళ నమ్మకం అంటూ ఫైర్ అయ్యారు. శ్రీనివాస్ అనే వ్యక్తి విజయసాయిరెడ్డి అల్లుడు కంపెనీకి చెందిన వాడని ఆరోపిస్తున్నారు.కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు చంద్రబాబు, లోకేష్ వ్యవహరిస్తున్నారంటూ దుమ్మెత్తి పోశారు.
విదాన్ అటో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వడ్లమూడి నాగరాజు అనే వ్యక్తి కియా మోటార్స్ డీలర్ ఇచ్చారు. ఇదే నాగరాజు హెరిటేజ్ కంపెనీల్లో డైరెక్టర్ గా కూడా ఉన్నాడు. శ్రీనివాస్ ఎలాగైతే వేరే కంపెనీల్లో డైరెక్టర్ గా ఉన్నాడో అదే నాగరాజుకు అప్లై కాదా? అని ప్రశ్నించారు. నంద్యాల విష్ణురాజు హెరిటేజ్, అమరరాజా బ్యాటరీస్ లోనూ డైరెక్టర్. అప్పుడుమరి అమరరాజ చంద్రబాబుదే అని నేను అనొచ్చా? అని అడిగారు.
లివ్ లైఫ్ హాస్పిటల్స్, ఎక్సెల్ కంపెనీల్లో హెరిటేజ్ కంపనీలో కామన్ డైరెక్టర్స్ ఉన్నారు. మరి అవి చంద్రబాబువి అని అనోచ్చా...? దివీస్ సంస్థ వ్యక్తులు నాకు క్లోజ్ ఫ్రెండ్స్...నారా ఫ్యామిలీకి క్లోజ్.. అలాగని దివీస్ నాది అయిపోతుందా...? అడాన్ కంపెనీ 3 శాతం మాత్రమే సప్లై చేస్తోంది. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక.. లేనిపోని ఆరోపణలు చేయొద్దు అని అన్నారు.
తల్చుకుంటే మీరు చేసే దుష్ప్రచారం కంటే పదింతలు దుష్ప్రచారం చేయగలను. పరిధులు దాటవద్దు అని చంద్రబాబు, లోకేష్ కి వార్నింగ్ ఇస్తున్నా.. అని హెచ్చరించారు విజయ సాయిరెడ్డి. మీరు వాడే అసభ్య పదజాలం మేము కూడా వాడగలం..ఆకాశం పైకి ఉమ్మెస్తే అది నీ మీదే పడుతుంది చంద్రబాబు... వేలకోట్ల ఎగ్గొట్టిన క్వారీ ప్రమోటర్లు ఎవరూ చంద్రబాబు..నీ భాగస్వామ్యులు కాదా...? అని తీవ్రంగా మందలించారు.
మీ కంపెనీలో డైరెక్టర్ గా ముత్తురాజు విజయకుమార్ సత్యం కంపెనీలో డైరెక్టర్ కాదా? నా బందువులు కంపెనీలు అన్నీ నావే అయితే హెరిటేజ్ కూడా నాదే..చంద్రబాబు నాకు బందువే... అన్న అవుతాడు. తారకరత్న ద్వారా నాకు చంద్రబాబు సోదరుడు అవుతాడు. అలాగని ఆయన ఆస్తులన్నీ నావి అయిపోతాయా..? నారా బ్రాహ్మణి 16 కంపెనీల్లో డైరెక్టర్...భువనేశ్వరీ 14 కంపెనీల్లో డైరెక్టర్, చంద్రబాబు చెప్పే లాజిక్ కరెక్ట్ అయితే నాకు ఆపాదించే ఆరోపణ ఒప్పుకుంటా...అన్నారు.
చెత్త పాలన, చెత్త రోడ్లు, చెత్తపై పన్నులు... జగన్ చెత్త సీఎంగా నిలిచిపోతారు : చంద్రబాబు
ఆ కంపెనీలన్నీ ఎర్రమంజిల్ లోని ఒకే చిరునామా నుంచి ఉన్నాయి. కామన్ డైరెక్టర్ గా ఉంటే ఆ కంపెనీ మీది అయిపోతుందా...?
క్రూయిజ్ కంపెనీ ఓనర్ షిప్ మాది అని చంద్రబాబుకి ఒక్కడికే తెలిసింది. అది నిజంగా మాదైతే నీకు ఫ్రీగా రాసిస్తాం. మద్యం శాంపిల్స్ టెస్ట్ కి పంపాం.హెరిటేజ్ పాలు కూడా శాంపిల్ తీసి టెస్ట్ కి పంపాం. రిపోర్ట్స్ వస్తాయి. దాన్ని బట్టి చర్యలు తీసుకుంటాం. మద్యం ప్రైవేట్ పరం అంటూ చంద్రబాబు, ఎల్లో మీడియాకు కల వచ్చిందేమో.. అని ఎద్దేవా చేశారు.
ఆ సర్వే చేసిన కంపెనీ ఎవరిది...రాబిన్ శర్మ దేగా.. ఇక దానికి క్రేడిబిలిటీ ఎక్కడ ఉంటుంది.. అని ప్రశ్నించారు విజయ్ సాయి రెడ్డి. రోడ్ల విషయంలో నిదులు ఇచ్చారు. ఎక్కడా నిర్లక్ష్యం ఉండదు. ఒక ఆదివాసీ మహిళకు రాష్ట్రపతి అభ్యర్థిత్వం ఇచ్చారు కాబట్టి మేము మద్దతు పలికాం. దానికి NDA కి లింక్ చేయాల్సిన అవసరం లేదు. గతంలో రామనాథ్ కోవింద్ కూడా ఎస్సీ కావడంతో మద్దతునిచ్చాం అని విజయ్ సాయి రెడ్డి చెప్పుకొచ్చారు.
