Asianet News TeluguAsianet News Telugu

విజయనగరం వైసిపి ఎమ్మెల్యే సంచలన నిర్ణయం... రాజీనామా చేస్తానని ప్రకటన

విజయనగరం జిల్లాలో ప్రతిపక్ష వైసిపి పార్టీకి చెందిన ఎమ్మెల్యే  ఒకరు సంచలన ప్రకటన చేశారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన ఇపుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

YCP MLA rajanna dora Sensational Decision
Author
Salur, First Published Aug 31, 2018, 1:40 PM IST

విజయనగరం జిల్లాలో ప్రతిపక్ష వైసిపి పార్టీకి చెందిన ఎమ్మెల్యే  ఒకరు సంచలన ప్రకటన చేశారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన ఇపుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని కరాసువలస మండలంలో ఇటీవల విషజ్వరాల కారణంగా 9 మంది చనిపోయారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే రాజన్న దొర పీడిక ఘాటుగా స్పందించారు. ఈ మరణాలపై అటు ప్రతిపక్ష వైసిపి గానీ ఇటు అధికార టిడిపి పార్టీలు స్పందించకపోవడంపై ఆయన మనస్థాపానికి గురయ్యారు. ఈ మరణాల గురించి పట్టించుకోకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. దీంతో ఈ విషయం విజయనగర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇలా అనారోగ్యంతో ప్రజలు చనిపోతున్నా ప్రభుత్వం తమకు పట్టనట్లు వ్యవమరించడం పై ఎమ్మెల్యే మండిపడ్డారు. ఇవి అనారోగ్యం కారణంగా సంభవించిన మరణాలు కావని ప్రభుత్వం చేసిన హత్యలేనని రాజన్న దొర పేర్కొన్నారు. ఈ విషయంపై స్పందించకుంటే తాను ప్రకటించినట్లు రాజీనామా చేయడం ఖాయమని రాజన్న దొర స్పష్టం చేశారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios