వైసీపీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా వైరస్ నిర్దారణ అయింది. ఆయనకు కరోనా సోకడం ఇది రెండోసారి. తనకు కరోనా సోకిన విషయాన్ని అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా వెల్లడించారు.
గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు రెండోసారి కరోనా వైరస్ సోకింది. ఇదివరకు ఓసారి కరోనా వైరస్ వ్యాధికి గురై చికిత్స పొందరు. మరోసారి తనకు కరోనా వైరస్ సోకినట్లు ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. రీఇన్ ఫెక్షన్ కు గురి కావడం ఆశ్చర్యంగా ఉందని రాంబాబు అన్నారు
జులైలో తనకు కోవిడ్ వచ్చి తగ్గిన విషయం అందరికీ తెలిసిందేనని, నిన్న అసెంబ్లీలో కోవిడ్ టెస్టు చేయించుకున్నానని, పాజిటివ్ రిపోర్టు వచ్చిందని ఆయన చెప్పారు. రీఇన్ ఫెక్షన్ కు గురి కావడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. అవసరమైతే అస్పత్రిలో చేరుతానని చెప్పారు మరోసారి కరోనాను జయించి వస్తానని ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్డునుడికి ఇటీవల రెండోసారి కరోనా పాజిటివ్ నిర్ణారణ అయింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురుకావడంతో ఆయన హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
జులైలో నాకు కోవిద్ వచ్చి
— Ambati Rambabu #StayHomeStaySafe (@AmbatiRambabu) December 5, 2020
తగ్గిన సంగతి మీ అందరికీ విధితమే
నిన్న అసెంబ్లీలో కోవిద్ టెస్ట్ చేయించాను,
రిపోర్ట్స్ పాజిటివ్ వచ్చాయి .రీ ఇన్ఫెక్షన్ కి గురికావడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
అవసరమైతే ఆస్పత్రి లో చేరతాను.
మీ ఆశీస్సులతో కోవిద్ ని
మరోసారి జయించి మీ ముందుకి వస్తాను
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 6, 2020, 7:35 AM IST