కర్నూలులో వింత.. భూమిలో నుంచి మంటలు
భూమిలోపల నుంచి మంటలు వస్తున్నాయి. జిల్లాలోని అవుకు మండలం మర్రికుంట తండాలో ఈ వింత చోటుచేసుకుంది.
కర్నూలు జిల్లాలో కనీవినీ ఎరగని వింత చోటుచేసుకుంది. భూమిలోపల నుంచి మంటలు వస్తున్నాయి. జిల్లాలోని అవుకు మండలం మర్రికుంట తండాలో ఈ వింత చోటుచేసుకుంది.
భూమి రెండు భాగాలుగా చీలి.. అందులో నుంచి మంటలు వస్తున్నాయి. ఆ మంటల ధాటికి ఆ ప్రాంతంలో ఉన్న విద్యుత్ స్తంభం కూలిపోవడం గమనార్హం. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. ఈ మంటలు ఎలా వస్తున్నాయనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు.