బైక్ ను ఢీ కొట్టిన లారీ.. మహిళ మృతి... !
గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరులోని శ్రీనగర్ మెన్ రోడ్డులో బైక్ పై వస్తున్న ఓ మహిళను లారీ డి కొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరులోని శ్రీనగర్ మెన్ రోడ్డులో బైక్ పై వస్తున్న ఓ మహిళను లారీ డి కొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
ఈ ప్రమాదానికి రోడ్డు మధ్యలో తవ్వడమే కారణం అని తెలుస్తోంది. శ్రీనగర్ మెన్ రోడ్డులో మంచినీటి సరఫరా సమస్య వుండటంతో కొత్తగా పైపు లైన్స్ వేస్తున్నారు. దీనికి సంబంధించిన పైపులను రోడ్డు మీద అలాగే వదిలేసి కాంట్రాక్టర్లు వెళ్లిపోయారు.
ఈ మధ్యలో పనులు పూర్తిగా ఆపేశారు. పైపులైను పనులకోసం తవ్వేసి, పనులు ఆపేయడంతో రహదారి పూర్తిగా గుంటలు గా ఏర్పడింది.మరోవైపు రోడ్డుపైనే ఆక్రమణలు వుండటంతో వాహనాలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఇలా ఓ మహిళ చనిపోవడం జరిగింది. మునిసిపల్ అధికారులు ఇకనైనా స్పందించి శ్రీనగర్, ఆరండల్ పేట 3వ అడ్డా రోడ్ పూర్తి చేయాలని కోరుతున్న శ్రీనగర్ వాసులు కోరుతున్నారు.