Asianet News TeluguAsianet News Telugu

పెళ్లి చేసుకోవాలని యువతిని కత్తితో బెదిరించిన యువకుడు: పోలీసులకు ఫిర్యాదు

ప్రేమించి పెళ్లి చేసుకోవాలని యువతిని ఓ వ్యక్తి కత్తితో బెదిరించాడు.ఈ విషయమై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

woman complaints against ajay for threatening in Vijayawada lns
Author
Vijayawada, First Published Nov 11, 2020, 11:38 AM IST


విజయవాడ: ప్రేమించి పెళ్లి చేసుకోవాలని యువతిని ఓ వ్యక్తి కత్తితో బెదిరించాడు.ఈ విషయమై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

విజయవాడ గవర్నర్ పేట -1 డిపోలో అసిస్టెంట్ ఇంజనీర్ గా ఓ యువతి విధులు నిర్వహిస్తోంది. అదే బస్ డిపోలో మెకానిక్ గా అజయ్ కుమార్ పనిచేస్తున్నాడు. ఒకే డిపోలో పనిచేస్తున్నందున ఆ యువతిని పెళ్లి చేసుకోవాలని అజయ్ భావించాడు.

ప్రేమ పేరుతో ఆమెను వేధించాడని  బాధితురాలు ఆరోపిస్తోంది. ఇటీవలనే ఆ యువతికి వేరే యువకుడితో వివాహం నిశ్చయమైంది.ఈ విషయం తెలిసిన అజయ్ కుమార్ బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెను కత్తితో బెదిరించాడు. తననే పెళ్లి చేసుకోవాలని  హెచ్చరించాడు.  తనను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని బెదిరింపులకు దిగాడని బాధితురాలు ఆరోపించారు.

ఈ విషయమై ఆమె సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios