మూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు..
దీని ప్రభావంతో శనివారం మోస్తారు వర్షాలు, ఆదివారం, సోమవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. తీరం వెంబడి గంటకు 50-60 కీ.మీ వెగంతో గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని హెచ్చరించారు.
అమరావతి : ఐఎండి సూచనల ప్రకారం పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతం
ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరప్రాంతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
దీని ప్రభావంతో శనివారం మోస్తారు వర్షాలు, ఆదివారం, సోమవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. తీరం వెంబడి గంటకు 50-60 కీ.మీ వెగంతో గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని హెచ్చరించారు.
మత్స్యకారులు మంగళవారం వరకు సముద్రంలోకి వేటకు వెళ్లరాదంటూ విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు హెచ్చరిక జారీ చేశారు. రాగల మూడు రోజుల వాతావరణ వివరాలు ఇలా ఉన్నాయి...
జూలై 10 శనివారం : ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు మిగిలినచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.
జూలై 11 ఆదివారం : కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు,
రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.
జూలై 12 సోమవారం : రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ భారీ వర్షాలు మిగిలిన చోట్ల మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు.