Asianet News TeluguAsianet News Telugu

Weather Report : చ‌ల్ల‌టి క‌బురు.. ఏపీకి 4 రోజులు ముందుగానే నైరుతి రుతుప‌వ‌నాల రాక‌..

అసని తుఫాను ప్రభావంతో నైరుతి రుతుపవనాలు ఏపీకి కొంత ముందుగానే రానున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ సారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువగానే వర్షాలు నమోదవుతాయని అంచనా వేశారు. 

Weather Report: 4 days before the arrival of the southwest monsoon in AP..
Author
Vishakhapatnam, First Published May 14, 2022, 10:58 AM IST

భారత వాతావ‌ర‌ణ శాఖ ఏపీకి చ‌ల్ల‌టి క‌బురును అందించింది. ఏపీలోకి నైరుతి రుతుపవనాలు నాలుగు రోజులు ముందుగానే ప్ర‌వేశించే అవ‌కాశం ఉంద‌ని చెప్పింది. అంటే సాధార‌ణంగా నైరుతీ రుతుప‌వ‌నాలు  కేర‌ళలోకి జూన్ 1వ తేదీన ప్ర‌వేశిస్తాయి. కానీ ఈ సారి ముందుగానే మే 27 న కేరళలో ప్రవేశించే అవకాశం ఉంది. దీని ప్ర‌భావంతో ఏపీకి కూడా ముందుగానే రుతుప‌వ‌నాలు రానున్నాయి. 

ఇదిలా ఉండ‌గా.. జూన్ 1వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో వర్షాలు కురుస్తాయి. విశాఖపట్నం, ఉత్తర ఆంధ్ర ప్రాంతానికి వ్యాప్తి చెంద‌డానికి మరో వారం పడుతుంది. ఈ విష‌యాల‌ను IMD శుక్రవారం ప్రకటించింది. రుతుపవనాల మేఘాలు మే 15న దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న బంగాళాఖాతం, మే 27న కేరళలో అస్తమించనున్నాయి. 

ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా ముకేష్ కుమార్ మీనా నియామకం

సాధారణ పరిస్థితుల్లో నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళకు, జూన్ 4 లేదా 5న రాయలసీమ ప్రాంతానికి వస్తాయి. గత ఏడాది నైరుతి రుతుపవనాలు రాయలసీమ ప్రాంతంపైకి వచ్చిన ఐదు రోజుల తర్వాత జూన్ 10న మొత్తం ఏపీని కవర్ చేశాయి. అయితే ఈ సారి వర్షాలు, గాలులతో AP, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలను ప్రభావితం చేసిన అసని తుఫాను రుతుపవన ప్రవాహాలను బంగాళాఖాతంలోకి కొంచెం ముందుగానే లాగడంలో సహాయపడిందని వాతావరణ నిపుణులు తెలిపారు. 

విస్తరించిన క్రాస్-ఈక్వటోరియల్ గాలుల కారణంగా దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలో మే 15 నాటికి నైరుతి రుతుపవనాలు ముందుకు సాగడానికి ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని IMD తెలిపింది. ప్రతీ సంవత్సరం రుతుపవనాలు భిన్నంగా ప్రవర్తిస్తాయని IMD-అమరావతి డైరెక్టర్ స్టెల్లా ఎస్ అన్నారు. ‘‘ ఇది వాతావరణ పరిస్థితులపై ఆధారపడి కదులుతుంది. అందువల్ల 2022లో నైరుతి రుతుపవనాల సమయంలో వర్షపాతం పరిమాణాన్ని అంచనా వేయడం చాలా తొందరగా ఉంది, ”అని ఆమె చెప్పారు. 

ఏపీలో 52 డ్రోన్‌లతో సమగ్ర భూ సర్వే .. ఇప్పటి వరకు పూర్తయ్యింది ఇదే : వివరాలు తెలిపిన మంత్రుల కమిటీ

ఈ సారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ నివేదిక ముందుగా అంచనా వేసింది. గతేడాది జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు ఏపీలో మొత్తం 613.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, ఇది సాధారణం కంటే 19 శాతం ఎక్కువ. 2020లో జూన్ 1, సెప్టెంబర్ 30 మధ్య AP మొత్తం 738.2 మిల్లీ మీట‌ర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం 514 మిల్లీ మీట‌ర్ల కంటే 44 శాతం ఎక్కువ. మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు ఊరట లభించింది. ఒంగోలులో 7.4, కడపలో 7.1, కావలిలో 7.3, నెల్లూరులో 6.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios