Asianet News TeluguAsianet News Telugu

కరోనా మృత్యుకేళి... దుర్గగుడి అర్చకుడి మృతి

నిత్యం విజయవాడ కనకదుర్గమ్మ సేవలో తరించే అర్చకులు రాచకొండ శివప్రసాద్ ను కూడా ఈ కరోనా వైరస్ బలితీసుకుంది. 
 

vijayawada durgamma temple priest death with covid akp
Author
Vijayawada, First Published Apr 25, 2021, 7:29 AM IST

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి మృత్యుకేళి కొనసాగుతోంది. తాజాగా నిత్యం విజయవాడ కనకదుర్గమ్మ సేవలో తరించే అర్చకులు రాచకొండ శివప్రసాద్ ను కూడా ఈ కరోనా వైరస్ బలితీసుకుంది. 

ఇటీవలే కోవిడ్ బారినపడ్డ శివప్రసాద్ చికిత్స కోసం ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు. అయితే గత శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడటంతో డిశ్చార్జి చేశారు. కానీ శనివారం మళ్లీ ఆయన ఆరోగ్యం క్షీణించి ఇంటివద్దే మృతి చెందారు. 

read more  ఏపీలో కరోనా కరాళనృత్యం: మరోసారి 11 వేలు దాటిన కేసులు... సిక్కోలులో తీవ్రరూపు

 విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో పనిచేస్తున్న సిబ్బందిలో 43 మందికి కరోనా సోకగా 20 మంది ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటున్నారు. మిగిలినవారంతా  హోం క్వారంటైన్ లో ఉన్నారు.  ఈ ఆలయంలో పనిచేసే  ఐదుగురు అర్చకులకు కూడా కరోనా సోకింది. వారు కూడ చికిత్స తీసుకొంటున్నారు. 

ఇక ఏపీలో రోజు రోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది. ఈ విషయమై డిప్యూటీ సీఎం ఆళ్ల నాని నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ సబ్ కమిటీ  సభ్యులు సీఎం జగన్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు వీలుగా అవసరమైన వ్యాక్సిన్లను రాష్ట్రానికి తెప్పించుకోవాలని జగన్ సర్కార్ ప్లాన్ చేస్తోంది.  

Follow Us:
Download App:
  • android
  • ios