Asianet News TeluguAsianet News Telugu

కర్నూల్‌లో భగ్గుమన్న పాతకక్షలు: ఒకరి మృతి

కర్నూల్ జిల్లాలో పాతకక్షలు భగ్గుమన్నాయి. ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 

Upendra kills by unknown persons in Kurnool district
Author
Kurnool, First Published Jan 1, 2020, 10:49 AM IST


కర్నూల్:కొత్త సంవత్సరం వేడుకల్లో పాత కక్షలు  పురివిప్పాయి. కత్తులతో దాడికి దిగడంతో ఉపేంద్ర అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

కర్నూల్‌ జిల్లా మహానంది మండలంలోని ఈశ్వర్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకొంది. కొత్త సంవత్సరం వేడుకల సమయంలో పాతకక్షలు పురివిప్పాయి. ఎరుకలి ఉపేంద్ర,  రాజశేఖర్, నాగార్జునలపై ప్రత్యర్థులు కత్తులతో దాడికి దిగారు.

ఈ ఘటనలో ఎరుకలి ఉపేంద్ర అక్కడికక్కడే మృతి చెందారు.  రాజశేఖర్, నాగార్జునలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన రాజశేఖర్, నాగార్జునలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు  చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios