రేపు శ్రీశైలానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా రేపు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఆయన పర్యటించనున్నారు. భ్రమరాంభ మల్లిఖార్జున స్వామి వార్లను అమిత్ షా దర్శించుకోనున్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా రేపు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఆయన పర్యటించనున్నారు. భ్రమరాంభ మల్లిఖార్జున స్వామి వార్లను అమిత్ షా దర్శించుకోనున్నారు. తొలుత ఢిల్లీ నుంచి బేగంపేట్ విమానాశ్రయానికి షా రానున్నారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్లో శ్రీశైలం వెళ్లనున్నారు అమిత్ షా. కేంద్ర హోం మంత్రి రానుండటంతో శ్రీశైలంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.