Asianet News TeluguAsianet News Telugu

కర్నూల్ జిల్లాలో ఇద్దరికి వజ్రాలు లభ్యం: రూ. 2 లక్షలకు విక్రయం

ఉమ్మడి కర్నూల్ జిల్లాలోని తుగ్గలి మండలంలో ఇద్దరికి వజ్రాలు లభ్యమయ్యాయి. పొలం పనులు చేస్తున్న ఇద్దరికి వేర్వేరు ప్రాంతాల్లో వజ్రాలు దక్కాయి. ఈ వజ్రాలను ఇద్దరు స్థానికంగా ఉన్న వజ్రాల వ్యాపారులకు విక్రయించారు. వజ్రాలు లభ్యం కావడంతో కూలీల కుటుంబాల్లో ఆనందం వ్యక్తమౌతుంది.

Two workers Found  Diamonds while working in the farm at Tuggali of Kurnool
Author
Kurnool, First Published Jun 29, 2022, 9:32 AM IST

కర్నూల్: ఉమ్మడి Kurnool జిల్లాలోని Tuggali  మండలంలో ఇద్దరికి Diamonds లభ్యమయ్యాయి. పొలం పనులు చేస్తున్న సమయంలో  ఇద్దరికి వేర్వేరు ప్రాంతాల్లో వజ్రాలు లభ్యమయ్యాయి. స్థానిక వజ్రాల వ్యాపారులకు ఈ వజ్రాలు దొరికిన కూలీలు విక్రయించారు.

జిల్లాలోని తుగ్గలి మండలంలోని గొరెగెట్ల గ్రామానికి చెందిన ఓ మహిళా కూలీ Tomoto  పొలంలో కలుపు తీస్తున్న సమయంలో వజ్రం లభ్యమైంది. ఈ వజ్రాన్ని ఆమె స్థానికంగా వజ్రాల వ్యాపారికి విక్రయించింది.ఈ వజ్రాన్ని రూ.2.50 లక్షల నగదుతో పాటు రెండు తులాల బంగారానికి  ఆమె స్థానిక వజ్రాల వ్యాపారికి  డైమండ్ ను విక్రయించారు.

 మరో వైపు ఇదే గ్రామానికి చెందిన మరో వ్యక్తికి కూడా వజ్రం లభ్యమైంది. ఈ వజ్రాన్ని అతను నగల వ్యాపారికి విక్రయించాడు. రూ. 15 వేల నగదుతో పాటు జత కమ్మలకు ఈ వజ్రాన్ని విక్రయించాడు. ఈ నెల 21న ఓ కూలీకి వజ్రం లభ్యమైంది. స్థానికంగా ఉన్న వజ్రాల వ్యాపారికి రూ. 45 వేలకు అతను ఈ వజ్రాన్ని విక్రయించాడు.

ఈ సీజన్ లో కర్నూల్ జిల్లాలో ముగ్గురికి వజ్రాలు లభ్యమయ్యాయి. తొలకరి వర్షాలు ప్రారంభమైన తర్వాత ఈ ప్రాంతంలో వజ్రాల కోసం అన్వేషణ ప్రారంభిస్తారు.2021 మే 27న కర్నూల్ జిల్లాలోని తుగ్గలి మండలంలో అత్యంత విలువైన వజ్రాలు దొరుకుతున్నాయి. జొన్నగిరి, పగిడిరాయి, జీ ఎర్రగుడి, పెరవలి ప్రాంతంలో ఇవి లభ్యమవుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చిన్న జొన్నగిరిలో ఒక రైతుకు విలువైన వజ్రం దొరికింది. పొలంలో పనులు చేస్తున్న ఆ రైతుకు వజ్రం దొరికింది. రహస్యంగా టెండర్ వేశారు. ఈ వజ్రాన్ని రూ.కోటి 25 లక్షలకు కొనుగోలు చేశారు గుత్తికి చెందిన వ్యాపారులు. అది బహిరంగ మార్కెట్‌లో రూ. 3కోట్లకు పైగా విలువ చేస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. 

2021 మే 29వ తేదీన తుగ్గలి మండలం జొన్నగిరిలో రెండు వజ్రాలు లభ్యమయ్యాయి. బొప్పాయి తోటలో కలుపు తొలగిస్తున్న మహిళా కూలీకి ఓ వజ్రం దొరికింది. ఆ వజ్రాన్ని ఓ వ్యాపారి రూ.70 వేలకు కొనుగోలు చేశారు. అదే విధంగా పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న మరో మహిళా కూలీకి  ఓ వజ్రం లభించింది. దాన్ని పెరవలికి చెందిన వ్యాపారికి రూ.40 వేలకు విక్రయించారు.

జిల్లా వాసులే కాదు అనంతపురం, కడప, ప్రకాశం, కర్ణాటకలోని బళ్లారి, తెలంగాణలోని పలువురు వజ్రాల కోసం ఈ ప్రాంతంలో వెతుకుతుంటారు. 

జిల్లాలోని జొన్నగిరి, తుగ్గలి, మద్దికెరా, పగిడిరాయ్, పెరావళి, మహానంది, మహాదేవపురం ప్రాంతాల్లో వజ్రాల కోసం ఏళ్ల తరబడి అన్వేషణ సాగిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైన జూన్ నుండి నవంబర్ వరకు పొలాల్లో  వజ్రాల కోసం అన్వేషణ  చేస్తుంటారు. 

విజయనగర సామ్రాజ్యానికి చెందిన శ్రీకృష్ణదేవరాయుడు, ఆయన మంత్రి తిమ్మరుసు  ఆలయం సమీపంలో వజ్రాలు, బంగారం ఆభరణాల నిధిని దాచిపెట్టారని స్థానికులు నమ్ముతారు. అందుకే ప్రతి ఏటా సిరివెళ్ల మండల ప్రధాన కార్యాలయంలోని నరసింహా ఆలయం చుట్టూ వజ్రాల కోసం వెతుకుతారు.

also read:కర్నూల్ లో కూలీకి దొరికిన వజ్రం: రూ. 45 వేలకు విక్రయం

కొన్ని విదేశీ సంస్థలు, సైంటిస్టులు, అమెరికా, అస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో ఐదేళ్లుగా వజ్రాల కోసం అన్వేషిస్తున్నాయి. మహాదేవపురం వద్ద 50 ఎకరాల భూమిని ఈ కంపెనీలు లీజుకు తీసుకొన్నాయి. భారీ యంత్రాలను ఉపయోగించి తవ్వకాలు చేపట్టాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios