Asianet News TeluguAsianet News Telugu

మదనపల్లె ఇండస్ట్రీయల్ ఏస్టేట్‌లో పేలుళ్లు: ఇద్దరికి గాయాలు


మదనపల్లె ఇండస్ట్రీయల్ ఏస్టేట్‌లో బుధవారం నాడు డిటోనేటర్ల పేలుడు చోటు చేసుకొంది. ఈ పేలుడు ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. 

two injured after Blast at Madanapalle industrial estate in Chittoor district
Author
Madanapalle, First Published Aug 11, 2021, 12:07 PM IST

మదనపల్లె: చిత్తూరు జిల్లా  మదనపల్లె ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో  బుధవారం నాడు డిటోనేటర్ల పేలుడు చోటు చేసుకొంది.. బండ పగులకొట్టడానికి షాపింగ్ కాంప్లెక్స్ నిర్వాహకులు డిటోనేటర్ల అమర్చి పేల్చారు. దీంతో బండరాళ్లు డిటోనేటర్లతో పేల్చడంతో పెద్ద పెద్ద బండరాళ్లు వచ్చి ఇంటిపైన పడటంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. ఇళ్ల మధ్య  డిటోనేటర్లు పేల్చడంపై  స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.. అక్కడి జనాలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios