Asianet News TeluguAsianet News Telugu

నర్సీపట్నంలోని జ్యుయలరీ దుకాణంలో అగ్ని ప్రమాదం: ఇద్దరు మృతి, మరో ఇద్దరికి గాయాలు

అనకాపల్లి  జిల్లాలోని నర్సీపట్నంలో  ఓ  జ్యుయలరీ  దుకాణంంలో  జరిగిన  అగ్ని ప్రమాదంలో  ఇద్దరు  మృతి  చెందారు.  మరో  ఇద్దరు  గాయపడ్డారు.  షార్ట్  సర్క్యూట్ కారణంగా  ప్రమాదం  జరిగిందని  పోలీసులు భావిస్తన్నారు.

Two Die After fire Accident at jewellery Shop In Anakapalle District
Author
First Published Nov 20, 2022, 11:07 AM IST

నర్సీపట్నం: అనకాపల్లి జిల్లాలోని నర్నీపట్నంలోని ఓ  జ్యుయలరీ  దుకాణంలో  అగ్ని ప్రమాదంతో  తండ్రీకొడుకులు   మృతి చెందారు. ఈ ప్రమాదంలో  మరో ఇద్దరు  గాయపడ్డారు.  నర్సీపట్నంలోని కృష్ణాబజారులో  ఉన్న  జ్యుయలరీ షాపులో  ఆదివారంనాడు  తెల్లవారుజామున  అగ్ని ప్రమాదం  చోటు  చేసుకుంది.   ఈ  ప్రమాదంలో  జ్యుయలరీ  దుకాణ  యజమాని  నానాజీ ఆయన  తనయుడు  మౌలేష్   మృతి  చెందారు.  ఈ ప్రమాదంలో  మరో  ఇద్దరు  గాయపడ్డారు.  ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా  అధికారులు  భావిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios