Asianet News TeluguAsianet News Telugu

నిన్న యువకుడు, నేడు యువతి.. విశాఖ రుషికొండ బీచ్‌లో మృతదేహాల కలకలం

విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌లో రెండు మృతదేహాలు కొట్టుకురావడం కలకలం రేపుతోంది. నిన్న ఓ యువకుడి మృతదేహం కొట్టుకురాగా.. శుక్రవారం యువతి మృతదేహం తీరానికి కొట్టుకొచ్చింది. 

two dead bodies found in vizad rushikonda beach
Author
Visakhapatnam, First Published Aug 12, 2022, 2:22 PM IST

విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌లో రెండు మృతదేహాలు కొట్టుకురావడం కలకలం రేపుతోంది. రుషికొండ సముద్రతీరానికి గురువారం ఒక యువకుడి మృతదేహం కొట్టుకొచ్చింది.. అతనిని నంద్యాలకు చెందిన వెంకటరెడ్డిగా గుర్తించారు. ఇదిలావుండగా శుక్రవారం తెల్లవారుజామున ఇదే బీచ్‌కు యువతి మృతదేహం కొట్టుకొచ్చింది. ఆమెను విజయనగరం జిల్లాకు చెందిన దివ్యగా నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీరిద్దరి ఆత్మహత్యగా భావిస్తున్నారు. వీరికి సంబంధించి వేర్వేరు పోలీస్ స్టేషన్‌లలో కేసులు ఏమైనా నమోదయ్యాయా లేదా అన్న కోణంలో విచారిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios