తిరుమల: 2009 ఆర్జిత సేవా టికెట్ల స్కామ్.. ఏడుగురు ఉద్యోగులపై ఈవో కొరడా
2009లో వెలుగుచూసిన ఆర్జిత సేవా టిక్కెట్ల స్కామ్ ఉద్యోగులపై టీటీడీ ఈవో చర్యలు చేపట్టారు. ఆరోపణలు ఎదుర్కొన్న ఉద్యోగులపై టీటీడీ ఈవో జవహర్ రెడ్డి కొరడా ఝళిపించారు. ఈ మేరకు ఏడుగురు ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు
2009లో వెలుగుచూసిన ఆర్జిత సేవా టిక్కెట్ల స్కామ్ ఉద్యోగులపై టీటీడీ ఈవో చర్యలు చేపట్టారు. ఆరోపణలు ఎదుర్కొన్న ఉద్యోగులపై టీటీడీ ఈవో జవహర్ రెడ్డి కొరడా ఝళిపించారు. ఈ మేరకు ఏడుగురు ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఐదుగురు ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు జవహర్ రెడ్డి. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో స్థాయి అధికారిని తొలగించాలని ప్రభుత్వానికి ఈవో సిఫారసు చేశారు.