విదేశీ చదువుల పేరిట రూ.44 లక్షల ఫ్రాడ్.. టిక్ టాక్ దంపతుల ఘరానా మోసం..
ఆ తరువాత ఏవో మాయమాటలు చెబుతూ మాటమార్చారు. దీంతో అనుమానం వచ్చిన బాధితులు డబ్బులు తిరిగి ఇచ్చేయాలని కోరారు. దీంతో కేటుగాళ్లు ఇద్దరు తమ సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నారు.
తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో టిక్ టాక్ తో ఫేమస్ అయిన ఘరానా దంపతుల ఉదంతం వెలుగులోకి వచ్చింది. కాగా, నిందితులు గోకవరానికి చెందిన గౌరి శంకర్ అనే వ్యక్తి కుమార్తెను విదేశాలకు ఉన్నత చదువుల కోసం పంపిస్తామని చెప్పి మామిడాల శ్రీధర్, చెరుకుమిల్లి గాయత్రీలు 44 లక్షలు వసూలు చేశారు.
ఆ తరువాత ఏవో మాయమాటలు చెబుతూ మాటమార్చారు. దీంతో అనుమానం వచ్చిన బాధితులు డబ్బులు తిరిగి ఇచ్చేయాలని కోరారు. దీంతో కేటుగాళ్లు ఇద్దరు తమ సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. కాగా, బాధితులు ఇద్దరు నిందితులమీద గోకవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచినట్టు తెలిపారు. కోర్టు నిందితులకు 15 రోజులపాటు రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.