Asianet News TeluguAsianet News Telugu

తల్లీ, కూతుర్ల గొంతు కోసి చంపిన దుండగులు.. సింగరాయ కొండలో దారుణం..

రవికిషోర్ సింగరాయకొండ రోడ్డులో  ఆర్కే జ్యుయలర్స్ పేరుతో బంగారు దుకాణం నిర్వహిస్తున్నారు. ఆయన రాత్రి 8.20 గంటల సమయంలో ఇంటికి వెళ్లి చూసేసరికి భార్య, కుమార్తె గొంతు కోసిన స్థితిలో, తీవ్ర రక్తస్రావమై అచేతనంగా పడి ఉన్నారు. వెంటనే విషయాన్ని చుట్టుపక్కల వారికి తెలియజేశారు. 

thugs who slit the throats of the mother and daughters in Singaraya konda
Author
Hyderabad, First Published Dec 4, 2021, 12:49 PM IST

సింగరాయకొండ :  ప్రకాశం జిల్లా టంగుటూరులో తల్లి కుమార్తె దారుణ హత్యకు గురయ్యారు. పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. టంగుటూరులో నివాసముంటున్న బంగారం వ్యాపారి జలదంకి రవికిశోర్ భార్య శ్రీదేవి (43) కుమార్తె వెంకట లేఖన (21)లను గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా గొంతు కోసి చంపేశారు. 

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రవికిషోర్ సింగరాయకొండ రోడ్డులో  RK Jewelers పేరుతో బంగారు దుకాణం నిర్వహిస్తున్నారు. ఆయన రాత్రి 8.20 గంటల సమయంలో ఇంటికి వెళ్లి చూసేసరికి భార్య, కుమార్తె slit throat స్థితిలో, తీవ్ర రక్తస్రావమై అచేతనంగా పడి ఉన్నారు. వెంటనే విషయాన్ని చుట్టుపక్కల వారికి తెలియజేశారు. 

వారి ద్వారా సమాచారం అందుకున్న ఎస్సై నాయబ్ రసూల్, సింగరాయకొండ సీఐ ఎం. లక్ష్మణ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. లేఖన ప్రస్తుతం బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఈ murderలు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది?  అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒంగోలు డీఎస్పి నాగరాజు నేతృత్వంలో. క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది.  

రవి కిషోర్ సోదరుడు రంగాకు చెందిన Gold jewelry దుకాణంలో మూడు నెలల క్రితం సుమారు ఎనిమిది వందల గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఆ కేసు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. ఇంతలోనే అదే కుటుంబానికి చెందిన రవికిశోర్ భార్య, కుమార్తె హత్యకు గురి కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా, వెంకట్రావుపేటలో దారుణం జరిగింది. అనుమానంతో పదకొండు నెలల కన్నకూతుర్నే కరెంట్ షాక్ పెట్టి చంపేశాడో కిరాతక తండ్రి.  దౌల్తాబాద్చెందిన సునీతను రెండేళ్ల కిందట వెంకట్రావుపేటకు చెందిన ఎం. రాజశేఖర్ వివాహమాడాడు.  కొంతకాలం కాపురం సజావుగా సాగింది. వీరికి ఒక girl child కూడా పుట్టింది. పాప పుట్టినప్పటినుంచి సునీత పై రాజశేఖర్, అతని తల్లిదండ్రులు నరసవ్వ, యాదయ్య, చెల్లెలు సౌందర్య suspicious పెంచుకున్నారు.

Konijeti Rosaiah: సీఎంగా రోశయ్య చేసిన ఆ పనిని మెచ్చుకున్న కాంగ్రెస్ అధిష్టానం..

ఈ అనుమానంతోనే తరచు కొట్లాట పెట్టుకునేవారు. రాజశేఖర్, సునీత తల్లిదండ్రుల ఇంటినుంచి అద్దె ఇల్లు చూసుకుని వేరుగా వచ్చేశారు. అక్కడ కొద్ది రోజులు బాగానే ఉన్నా.. ఆ తరువాత రాజశేఖర్ మళ్లీ మొదటికి వచ్చాడు. తల్లిదండ్రుల వద్దే ఉందామంటూ సునీతతో ఘర్షణ పడుతున్నాడు. 

అదే క్రమంతో శుక్రవారం  భార్యను ఇదే విషయమై తిట్టి, కొట్టి కుమార్తె ప్రిన్సి (11 నెలలు) ఎత్తుకొని బయటికి వచ్చాడు. నేరుగా తాను కౌలు చేస్తున్న భూమి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ప్రిన్సీ కాళ్ల గజ్జల కు తీగలు చుట్టి మోటార్ స్టార్టర్ నుంచి విద్యుత్ సరఫరా అయ్యేలా చేశాడు. కరెంట్ షాక్ తో చిన్నారి కన్నుమూసింది. తరువాత రాజశేఖర అక్కడే పురుగుల మందు తాగాడు. అంతకు ముందు మరో రైతుకి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. ఆ రైతు గ్రామస్తులకు సమాచారం అందించి... వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే కరెంట్ షాక్ తో పాప చనిపోయి ఉంది. రాజశేఖర్ కొన ప్రాణాలతో ఉన్నాడు. 

కరెంట్ షాక్ తోమాడిపోయిన పసికందు పాదాల్ని, కాలి గజ్జెల్ని చూసి తల్లి సునీత గుండెలు బాదుకుంటూ కన్నీరుమున్నీరయ్యింది. నిందితుడు రాజశేఖర్ ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది, 

Follow Us:
Download App:
  • android
  • ios