అనంతపురం ద్రాక్షతోటలో ముగ్గురు అనుమానాస్పద మృతి: పోలీసుల దర్యాప్తు
అనంతపురం జిల్లాలోని అలమూరులోని ద్రాక్షతోటలో ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మరణించారు.ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురం: అనంతపురంలో ద్రాక్షతోటలో ముగ్గురు అనుమానాస్పదస్థితిలో మరణించారు. తొలుత ఈ ముగ్గురు యువకులు ద్రాక్షతోటలో అపస్మారక స్థితిలో ఉన్న విషయాన్ని గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ముగ్గురు మరణించారు. ఈ ముగ్గురు కూడా మహారాష్ట్రకు చెందిన యువకులని స్థానికులు చెప్పారు.
అయితే ఈ ముగ్గురు మరణానికి గల కారణాలు తెలియరాలేదు. అనుమానాస్పదస్థితిలో ఈ ముగ్గురు పడి ఉండడానికి కారణాలు తెలియాల్సి ఉందని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ తెలిపింది.ఈ ముగ్గురి మరణానికి గల కారణాలు పోస్టుమార్టం రిపోర్టులో తేలనుంది.