వెంటనే ముగ్గురు చిన్నారులకు ప్రథమ చికిత్స నిమిత్తం చోడవరం తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కి తరలించారు.

దేశ వ్యాప్తంగా ఆనందంగా జరుపుకునే పండగల్లో దీపావళి ఒకటి. కాగా.. ఈ దీపావళి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన విశాఖపట్నంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

విశాఖ జిల్లా చోడవరం రామ్మోహనపేట( అన్నవరం) లో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దీపావళి పండగ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఇంట్లో మందుగుండు తయారు చేస్తుండగా.. అది ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.

వెంటనే ముగ్గురు చిన్నారులకు ప్రథమ చికిత్స నిమిత్తం చోడవరం తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కి తరలించారు. కాగా.. చిన్నారుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన చిన్నారులు పెన్నడ మహేష్, తలారి జ్యోషిత్ , శివలంక నిఖిల్ గా గుర్తించారు. కాగా.. పండగ రోజే ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. చిన్నారులకు కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.