తోట్లవల్లూరులో మంగళవారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది.లోకేష్ అరెస్ట్ తో టీడీపీ కార్యకర్తలు, నేతలు ఆందోళనకు దిగారు. ఈ సమయంలో పోలీసులు ఎమ్మెల్యేను జాగ్రత్తగా పంపారు.
గుంటూరు: రాజదానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తోట్లవల్లూరు కరకట్ట వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. లోకేష్ అరెస్ట్ను నిరసిస్తూ రహదారిపై టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఆ సమయంలో అటుగా వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేను టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టారు. ఎమ్మెల్యేను ఘోరావ్ చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని తాను తిరిగి వస్తుండగా తోట్లవల్లూరు కరకట్ట వద్దకు చేరుకొన్నారు. ఆ సమయంలో లోకేష్ అరెస్ట్ కు నిరసనగా టీడీపీ కార్యకర్తలు టైర్లు కాల్చి నిరసనలకు దిగారు. అదే సమయంలో నిరసనలకు దిగిన టీడీపీ కార్యకర్తలు వైసీపీ ఎమ్మెల్యేను చూసి ఘోరావ్ చేశారు.
ఈ సమయంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు తనపై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించారని ఎమ్మెల్యే అనిల్ విమర్శించారు. ఆ తర్వాత పోలీసులు అతి కష్టం మీద ఎమ్మెల్యే అనిల్ను అక్కడ నుండి పంపించారు. తనతో పాటు గన్మెన్తో పాటు ఇద్దరు మాత్రమే ఉన్నారని ఎమ్మెల్యే అనిల్ చెప్పారు.
