Asianet News TeluguAsianet News Telugu

తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది.. వైఎస్ఆర్సీపీ స‌ర్కారు రూ.3.29 లక్షల కోట్లు స్వాహా చేసింది : టీడీపీ

Kakinada: రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధికారంలోకి వ‌స్తుంద‌ని ఆ పార్టీ నాయ‌కుడు స‌తీష్ బాబు ధీమా వ్య‌క్తం చేశారు. "తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌నీ, మ‌రోసారి ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌మాణ స్వీకారం చేస్తార‌ని" ఆయ‌న పేర్కొన్నారు. 
 

Telugu Desam will come to power, Chandrababu will become the CM : Satish Babu RMA
Author
First Published Oct 21, 2023, 12:58 PM IST

Telugu Desam Party (TDP): 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధికారంలోకి వస్తుందనీ, మ‌రోసారి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని తెలుగుదేశం ఆచంట నియోజకవర్గ పరిశీలకులు బొల్లా సతీష్ బాబు ధీమా వ్య‌క్తం చేశారు. సతీష్ బాబు నియోజకవర్గంలో పర్యటించిన త‌ర్వాత టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు అనీ, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామ‌ని చెప్పారు. రాష్ట్రంలోని మహిళలు ఎన్నికల కోసం, తెలుగుదేశం విజయం కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారని తెలిపారు.

తెలుగు దేశం అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు ఆడ బిడ్డ నిధి కింద నెలకు రూ.1800, దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, పిల్లలందరికీ ఒక్కొక్కరికి రూ.15వేలు చొప్పున అందజేస్తామని చెప్పారు. 'తల్లికి వందనం' పథకం కింద కుటుంబ సభ్యులను విద్యాభ్యాసానికి ప్రోత్సహించేందుకు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం క‌ల్పిస్తామ‌ని చెప్పారు. ఈ పథకాలన్నీ టీడీడీ హయాంలో మహిళలకు ఎంతో మేలు చేస్తాయ‌ని చెప్పారు. 

ఇదిలావుండ‌గా, గడిచిన నాలుగున్నరేళ్ల పాలనలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రూ.3.29 లక్షల కోట్లు దోచుకుందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2024లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అన్ని కుంభకోణాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని ప్రకటించారు. వివిధ ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1.10 లక్షల కోట్లు విడుదల చేసిందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఏటా రూ.8,600 కోట్ల పంచాయతీ నిధులు, రూ.32,000 కోట్ల ఎన్‌ఆర్‌ఈజీఎస్‌, రూ.42,000 కోట్ల జల్‌ జీవన్‌ మిషన్‌, రూ.6,000 కోట్ల మద్యం మనీకి లెక్కప‌క్కా లేదని నిలదీశారు.

ఇసుక కోసం వైఎస్ఆర్సీపీ నకిలీ వే బిల్లులు సృష్టించి రూ.25 వేల కోట్లు స్వాహా చేసిందని ఎమ్మెల్యే ఆరోపించారు. ప్రతి పెన్షనర్‌కు రూ.3వేలు ఇస్తామని అధికార పార్టీ హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేస్తూ.. ఇప్పటి వరకు అది నెరవేరలేదని విమ‌ర్శించారు. భూ కుంభకోణంపై బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ విశాఖపట్నం రాజధానిపై పెద్దఎత్తున భూ ఆక్రమణలు జరిగాయని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి బహిరంగంగానే అంగీకరించారన్నారు. అధికార పార్టీ  నాయకులు వైజాగ్‌లో ఎకరం రూ.10 లక్షలకు భూములు కొనుగోలు చేశారనీ, అయితే స‌ర్కారు మాత్రం వారి నుంచి రూ.50 లక్షలకు కొనుగోలు చేసిందని ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో కేంద్రం ఆరోగ్య సురక్ష పథకాన్ని తన సొంత పథకంగా చెప్పుకుని అమలు చేస్తోందని విమర్శించారు.

Follow Us:
Download App:
  • android
  • ios