Asianet News TeluguAsianet News Telugu

బందరు పోర్టు: చంద్రబాబుకు షాక్, జగన్‌కు జై కొట్టిన కేశినేని

టీడీపీ ఎంపీ కేశినేని నాని జగన్ కు జై కొట్టారు. బందరు పోర్టు ఒప్పందం  రద్దు చేస్తూ తీసుకొన్న నిర్ణయంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 

tdp mp kesineni nani supports jagan decision over bandaru port agreement
Author
Vijayawada, First Published Aug 9, 2019, 3:05 PM IST

విజయవాడ: ఏపీ సీఎం వైఎస్ జగన్ కు  టీడీపీ ఎంపీ కేశినేని నాని మద్దతు ప్రకటించారు.బందరు పోర్టు ఒప్పందాన్ని రద్దు చేస్తూ జగన్ సర్కార్ తీసుకొన్న నిర్ణయాన్ని ఆయన సమర్ధించారు. ఈ మేరకు తన ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకొన్నారు.

బందరు పోర్టు  ఒప్పందాన్ని రద్దు చేసుకోవడాన్ని సమర్ధిస్తూనే జగన్ కు సలహాలిచ్చారు. ఈ పోర్టు నిర్మాణ పనులను తెలంగాణకో, వాన్‌పిక్‌కో లేక ఇతర ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టకుండా ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. ప్రభుత్వమే ఈ పోర్ట్ పనులను నిర్వహించేలా నిర్ణయం తీసుకోని  చిత్తశుద్దిని నిరూపించుకోవాలని కేశినేని నాని జగన్ ను కోరారు.

 

 

ఈ ప్రాజెక్టు పనులను సకాలంలో చేపట్టలేదన్న కారణంగానే గతంలో మచిలీపట్నం పోర్ట్ లిమిటెడ్ కు ఇచ్చిన  కాంట్రాక్టు ఒప్పందాన్ని జగన్ సర్కార్ రద్దు చేసింది.  ఆ సంస్థకు లీజుకు ఇచ్చిన భూమిని వెనక్కు తీసుకోవడంతో పాటు ప్రభుత్వానికి నష్టం కల్గించినందుకు పరిహారం కోరే అవకాశాలను కూడ పరిశీలించాలని ప్రభుత్వం న్యాయ నిపుణులను కోరింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios