జగన్ ఎఫెక్ట్: లోక్సభలో కాపు కోటాపై గళమెత్తిన ఆవంతి శ్రీనివాస్
కాపుల రిజర్వేషన్ అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని టీడీపీ ఎంపీ ఆవంతి శ్రీనివాస్ లోక్సభలో కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై సోమవారం నాడు టీడీపీ ఎంపీ ఆవంతి శ్రీనివాస్ ఈ అంశాన్ని ప్రస్తావించారు.
న్యూఢిల్లీ:కాపుల రిజర్వేషన్ అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని టీడీపీ ఎంపీ ఆవంతి శ్రీనివాస్ లోక్సభలో కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై సోమవారం నాడు టీడీపీ ఎంపీ ఆవంతి శ్రీనివాస్ ఈ అంశాన్ని ప్రస్తావించారు.
కాపుల రిజర్వేషన్ల విషయమై పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీయాలని చంద్రబాబునాయుడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు టీడీపీ ఎంపీలను ఆదేశించారు. సోమవారం నాడు ఉదయం బాబు టీడీపీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ టెలికాన్పరెన్స్ లో కాపులకు రిజర్వేషన్ల విషయమై లోక్సభలో ప్రస్తావించాలని కోరారు. కాపులకు విద్య, ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఏపీ శాసనసభ తీర్మానం చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ మేరకు షెడ్యూల్ 9లో ఈ విషయాన్ని చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
కాపు రిజర్వేషన్ల విషయమై ఏపీ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ విషయమై కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. కాపుల రిజర్వేషన్ విషయమై బీజేపీ వైఖరిని బయటపెట్టేందుకు పార్లమెంట్ వేదికగా టీడీపీ ఎంపీలు ఈ విషయాన్ని ప్రస్తావించారు.