Asianet News TeluguAsianet News Telugu

జగన్ ఎఫెక్ట్: లోక్‌సభలో కాపు కోటాపై గళమెత్తిన ఆవంతి శ్రీనివాస్

కాపుల రిజర్వేషన్ అంశంపై  కేంద్రం నిర్ణయం తీసుకోవాలని  టీడీపీ ఎంపీ ఆవంతి శ్రీనివాస్ లోక్‌సభలో కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై  సోమవారం నాడు టీడీపీ ఎంపీ ఆవంతి శ్రీనివాస్ ఈ అంశాన్ని ప్రస్తావించారు.
 

TDP MP Avanthi Srinivas demands for Kapu reservations in Lok Sabha

న్యూఢిల్లీ:కాపుల రిజర్వేషన్ అంశంపై  కేంద్రం నిర్ణయం తీసుకోవాలని  టీడీపీ ఎంపీ ఆవంతి శ్రీనివాస్ లోక్‌సభలో కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై  సోమవారం నాడు టీడీపీ ఎంపీ ఆవంతి శ్రీనివాస్ ఈ అంశాన్ని ప్రస్తావించారు.

కాపుల రిజర్వేషన్ల విషయమై పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీయాలని  చంద్రబాబునాయుడు  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  టీడీపీ ఎంపీలను ఆదేశించారు. సోమవారం నాడు ఉదయం బాబు టీడీపీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ టెలికాన్పరెన్స్ లో  కాపులకు రిజర్వేషన్ల విషయమై  లోక్‌సభలో ప్రస్తావించాలని కోరారు.  కాపులకు విద్య, ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఏపీ శాసనసభ తీర్మానం చేసిన   విషయాన్ని ఆయన ప్రస్తావించారు.  ఈ మేరకు షెడ్యూల్ 9లో  ఈ విషయాన్ని చేర్చాలని  ఆయన డిమాండ్ చేశారు.

కాపు రిజర్వేషన్ల  విషయమై ఏపీ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.  ఈ విషయమై కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.  కాపుల రిజర్వేషన్ విషయమై బీజేపీ వైఖరిని బయటపెట్టేందుకు  పార్లమెంట్ వేదికగా  టీడీపీ ఎంపీలు ఈ విషయాన్ని ప్రస్తావించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios