మోహన్ బాబుని కలిసిన టీడీపీ ఎమ్మెల్సీ
మోహన్ బాబుని పరామర్శించిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న
సినీ నటుడు మోహన్ బాబుని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కలిశారు. ఇటీవల మోహన్ బాబు తల్లి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న బుద్దావెంకన్న తిరుపతి రంగంపేట గ్రామం వెళ్లి మోహన్బాబును ఆయన నివాసంలో కలిసి పరామర్శించి సానుభూతి తెలియజేశారు. వెంకన్న వెంట ఆయన కుమారుడు వరుణ్ ఉన్నాడు.