Asianet News TeluguAsianet News Telugu

ఆ కాలువ పనుల్లో రూ.30 కోట్ల అవినీతి : మంత్రి కాకాణిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపణలు

కనుపూరు కాలువ పనుల్లో మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి రూ.30 కోట్ల అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కనుపూరు కాలువపై ఇరిగేషన్ అధికారులు సమాచారం ఇవ్వడం లేదని, కాలువల పూడికతీతలో అధికారులతో కలిసి రూ.90 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. 

tdp leader somireddy chandramohan reddy sensational comments on minister kakani govardhan reddy
Author
First Published Jan 19, 2023, 2:39 PM IST

వైసీపీ నేత, మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కనుపూరు కాలువ పనుల్లో మంత్రి కాకాణి రూ.30 కోట్ల అవినీతికి పాల్పడినట్లు సోమిరెడ్డి ఆరోపించారు.ఇరిగేషన్ పనులపై వాస్తవాలు చెప్పే దమ్ము ధైర్యం కాకాణికి వుందా అని ఆయన ప్రశ్నించారు. కనుపూరు కాలువపై ఇరిగేషన్ అధికారులు సమాచారం ఇవ్వడం లేదని, కాలువల పూడికతీతలో అధికారులతో కలిసి రూ.90 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. 

కాగా.. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రమేయం ఉన్న కేసుకు సంబంధించి నెల్లూరులోని 4వ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో జరిగిన మెటీరియల్ చోరీపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే సీబీఐ అధికారులు ఈ కేసుకు సంబంధించిన ఫిర్యాదుదారు, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నుంచి పలు వివరాలను సేకరించారు. తాజాగా బుధవారం మరోసారి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నుంచి సీబీఐ అధికారులు విచారించారు. గతవారం సీబీఐ అధికారుల విచారణ అనంతరం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ అధికారులు నిర్మలాదేవి, అనంతకృష్ణన్‌లు తనను గంటన్నరకు పైగా విచారించారని చెప్పారు. వచ్చే వారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని కోరారని చెప్పారు. సీబీఐ తనకు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందని సోమిరెడ్డి పేర్కొన్నారు.

ALso REad: కాకాణి పుణ్యమా అని సీబీఐ విచారణ ఎదుర్కొన్నా : టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

అసలు వివాదం విషయానికి వస్తే.. మలేషియా, సింగపూర్, హాంగ్ కాంగ్ లలో సోమిరెడ్డికి ఆస్తులు ఉన్నాయని, పెద్దమొత్తంలో లావాదేవీలు జరిపారని కాకాని గతంలో ఆరోపణలు చేశారు. అంతేకాకుండా, ఇందుకు సంబంధించిన కొన్ని పత్రాలనూ ఇటీవల విడుదల చేశారు. ఆ పత్రాలను మీడియా ముందు కూడా ఉంచారు. అయితే ఆ పత్రాలన్నీ నకిలీవని, తనపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని, ఈ నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. 

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదల చేసిన పత్రాలు ఫోర్జరీవిగా పోలీసులు గుర్తించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి  తెచ్చిన డాక్యుమెంట్లు ఫోర్జరీవి అని ఫోరెన్సిక్ లేబోరేటరీ తేల్చింది. అసలు సోమిరెడ్డి మలేషియాకు వెళ్లలేదని ఇమ్మిగ్రేషన్ అధికారులు ధ్రువీకరించారు. ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో కొందరిని అరెస్టు కూడా చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు చార్జీషీట్ ను కూడా దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను కోర్టులో భద్రపరిచారు. అయితే 2022 ఏప్రిల్ 14న ఈ కేసులో కోర్టుకు సమర్పించిన మెటీరియల్ చోరీకి గురైంది. ఈ ఘటనను సుమోటోగా తీసుకుని విచారించిన హైకోర్టు.. విచారణను సీబీఐకి అప్పగించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios