Asianet News TeluguAsianet News Telugu

జగన్ పాలనే మా పార్టీని గెలిపించనుంది: జేసీ ప్రభాకర్ రెడ్డి

జగన్ పాలనే తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీపీని గెలిపిస్తోందని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు.

TDP leader JC prabhakar Reddy campaign in Tadipatri municipality lns
Author
Amaravathi, First Published Mar 7, 2021, 2:57 PM IST


తాడిపత్రి: జగన్ పాలనే తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీపీని గెలిపిస్తోందని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు.

తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీపీ అభ్యర్ధుల తరపున జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదివారం నాడు ప్రచారం నిర్వహించారు.  ఈ మున్సిపాలిటీ చైర్మెన్ అభ్యర్ధిగా  స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనయుడిని వైసీపీ బరిలోకి దించింది.

టీడీపీ కూడ ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. రెండేళ్లలో జగన్ సర్కార్ చేసిన పాలనతో ప్రజలు విసిగిపోయారని ఆయన చెప్పారు. 

తమ పార్టీ అభ్యర్ధులను గెలిపిస్తే మున్సిపాలిటీని అభివృద్ది చేస్తామని ఆయన తెలిపారు.  ఇప్పటికే ఈ మున్సిపాలిటీలో రెండు స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా గెలిచింది. మిగిలిన 34 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. గెలుపుపై ఇరువర్గాలు ధీమాతో ఉన్నాయి. తాడిపత్రిని తమ సత్తాను చాటేందుకు టీడీపీ సర్వశక్తులను ఒడ్డుతోంది.

గతంలో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మెన్ గా ప్రభాకర్ రెడ్డి పనిచేశారు. ఆ తర్వాత ఇదే స్థానం నుండి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించిన విషయం తెలిసిందే. 
 

Follow Us:
Download App:
  • android
  • ios