వైసీపీ నేత, ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మరణంపై టీడీపీ (tdp) నేత బండారు సత్యనారాయణ (bandaru satyanarayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. బెదిరించడం వల్లే ఆయన గుండెపోటుకు గురయ్యారని.. పరిశ్రమలు తీసుకురావాలని గౌతంరెడ్డిని మానసిక క్షోభకు గురిచేశారని బండారు  సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

వైసీపీ నేత, ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మరణంపై టీడీపీ (tdp) నేత బండారు సత్యనారాయణ (bandaru satyanarayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. గౌతమ్‌రెడ్డి మరణంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. దుబాయ్‌లో వుండగా గౌతమ్‌రెడ్డిని బెదిరించింది ఎవరని బండారు ప్రశ్నించారు. బెదిరించడం వల్లే ఆయన గుండెపోటుకు గురయ్యారని.. పరిశ్రమలు తీసుకురావాలని గౌతంరెడ్డిని మానసిక క్షోభకు గురిచేశారని బండారు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బండారు వ్యాఖ్యలను వైసీపీ ఖండించింది. గౌతంరెడ్డి కుటుంబానికి బండారు బహిరంగ క్షమాపణలు చెప్పాలని వైసీపీ డిమాండ్ చేసింది. తప్పుడు వ్యాఖ్యలు, వక్రీకరణలకు బండారు పాల్పడ్డారని మండిపడింది. బండారు మానసిక స్థితిని తక్షణమే పరిశీలించాలని మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహ్మాన్ చురకలు వేశారు. 

కాగా.. Mekapati Goutham Reddy భౌతిక కాయం Hyderabad నుండి Nelloreకు మంగళవారం నాడు చేరుకొంది. హైద్రాబాద్ Begumpet విమానాశ్రయం నుండి ప్రత్యేక Helicopter లో నెల్లూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ కు గౌతం రెడ్డి భౌతిక కాయాన్ని తరలించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నుండి మేకపాటి గౌతం రెడ్డి స్వగృహనికి పార్ధీవ దేహన్ని తరలించారు. గుండెపోటుతో సోమవారం నాడు మేకపాటి గౌతం రెడ్డి సోమవారం నాడు మరణించిన విషయం తెలిసిందే.

గౌతం రెడ్డిని కడసారి చూసేందుకు అభిమానులు, YCP శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. గౌతం రెడ్డి తనయుడు Arjun Reddy ఇవాళ రాత్రికి అమెరికా నుండి నెల్లూరుకు చేరుకొంటారు. బుధవారం నాడు గౌతం రెడ్డి అంత్యక్రియలను నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ సహా పలువురు మంత్రులు రేపు నెల్లూరు రానున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు, మంత్రులు కూడా నెల్లూరుకు చేరుకొన్నారు. 

రేపు ఉదయం వరకు మేకపాటి గౌతం రెడ్డి ఇంట్లోనే ఆయన పార్ధీవ దేహన్ని ఉంచనున్నారు.ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో మేకపాటి గౌతం రెడ్డి అంత్యక్రియలను నిర్వహిస్తారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నుండి ఆయన నివాసానికి పార్ధీవ దేహన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. పార్ధీవ దేహం తరలింపు సమయంలో రోడ్డుకు ఇరువైపులా ప్రజలు నిలబడి గౌతం రెడ్డిని చివరి సారి చూసేందుకు ప్రయత్నించారు. బుధవారం నాడు ఉదయం ఉదయం 11గంటలకు ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు.