Asianet News TeluguAsianet News Telugu

జగన్ హయాంలో మరో భారీ మోసం

టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌కి వైఎస్సార్సీపీ నాయకుల అవినీతి, భూకబ్జాలపై అనేక ఫిర్యాదులు అందాయి. అన్యాయంగా పెన్షన్లు నిలిపివేశారని బాధితులు వాపోయారు. తనను వైసీపీ నేతలు దారుణంగా మోసం చేశారని ఓ సంస్థ ప్రతినిధి తెలుగుదేశం నేతలకు ఫిర్యాదు చేశారు.

TDP Grievance Cell: Victims of YSRCP Corruption Seek Justice GVR
Author
First Published Aug 29, 2024, 11:23 PM IST | Last Updated Aug 29, 2024, 11:23 PM IST

గత ప్రభుత్వం జరిగిన మరో మోసం వెలుగులోకి వచ్చింది. వైసీపీ నేతలు చేసిన మోసానికి ఆత్మహత్య చేసుకోబోయి న్యాయం కోసం తీరుగుతున్న విశాఖ వాసి ప్రిజమ్స్ సిరియస్ అడ్వటేజింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన షణ్ముఖ పవన్.. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్‌ను ఆశ్రయించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, తెలుగుదేశం నేతలు బొల్లినేని రామారావు, నరసింహ ప్రసాద్‌లకు ఫిర్యాదు చేశారు. నాడు పోలీసుల ఒత్తిడితో ఎలాంటి ఒప్పందం లేకుండానే తాను టూరిజం పోలీస్ సెక్యూరిటీ పోస్టులను ఏర్పాటు చేశానని.. దానికి దాదాపు రాష్ట్రంలో అన్నిచోట్లకు తీసుకున్న మెటిరియల్‌తో కలిపి రూ. కోటి 80లక్షల వరకు ఖర్చు అయ్యిందని తెలిపారు. వాటిని 2023 ఫిబ్రవరి 14న ఆన్ లైన్‌లో బటన్ నొక్కి  ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి జగన్, అప్పటి హోంమంత్రి తానేటి వనిత, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిలు ప్రారంభించారని వివరించారు. ఈ పోస్టుల నిర్వహణకు రూ.200 కోట్లు రిలీజ్ చేశారని.. ఆ డబ్బులు ఎవరు తిన్నారో ఎమో తెలియదని చెప్పారు. తాను ఏర్పాటు చేసిన పోస్టులకు మాత్రం డబ్బులు ఇవ్వలేదని... డబ్బుల కోసం వెళ్లి అడగ్గా అసలు ఆ పోలీసు సెక్యూరిటీ పోస్టుల ఏర్పాటుకు వైసీపీ ప్రభుత్వం ఎటువంటి జీవో విడుదల చేయలేదని తేలిందని తెలిపారు. అవుట్ పోస్టుల వద్ద డిజిటల్ బోర్టులు ఏర్పాటు చేసుకుని ప్రకటనలపై వచ్చే ఆదాయం తీసుకోవాలని చెప్పి దాన్ని అడ్డుకున్నారని... తాను పూర్తిగా మోసపోయానని.. తనకు న్యాయం చేయాలని షణ్ముఖ పవన్ టీడీపీ నేతల ఎదుట కన్నీటి పర్యంతం అయ్యారు. అతని నుండి అర్జీని స్వీకరించిన నేతలు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

TDP Grievance Cell: Victims of YSRCP Corruption Seek Justice GVR

టీడీపీ గ్రీవెన్స్‌కి అందిన మరికొన్ని ఫిర్యాదులివే...

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ బాడీగార్డుగా పనిచేస్తోన్న నేలపూడి సురేష్ తన పొలాన్ని లాక్కున్నాడని ఏలూరు జిల్లా కలిదిండి మండలం సంతోషపురం పంచాయతీ నరసింహపురం గ్రామానికి చెందిన అంకాలభోగేశ్వరరావు నేడు గ్రీవెన్స్ లో నేతలకు ఫిర్యాదు చేశారు. 2022లో సురేష్ తాను జగన్ సెక్యూరిటీనని చెప్పి తనపై దౌర్జన్యం చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తానని బెదిరించి ఖాళీ స్టాంప్ కాగితాలపై సంతకాలు చేయించుకెళ్లాడని వాపోయారు. దయచేసి తమ భూమి తమకు ఇప్పించాలని వేడుకున్నారు. 

అన్నమయ్య జిల్లా పీటీఎం మండలం మజరా బొంతలవారిపల్లికి చెందిన బొంత నరసింహారెడ్డి విజ్ఞప్తి చేస్తూ.. రీ సర్వే పేరుతో తమ పేర్లమీద ఉన్న భూములను మండల తహశీల్దార్ అక్రమంగా మరోకరి పేరుమీదకు మార్చారని దీనిపై స్పందనలో కూడా అర్జీలు ఇచ్చామని భూ యజమానుల పేర్లు తొలగించి అక్రమంగా మరోకరి పేర్లపైకి భూములు మారుస్తున్న తహశీల్దార్ ను ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగించి తమ భూమి తమకు ఇప్పించాలని ఆయన గ్రీవెన్స్ లో నేతల ముందు వేడుకున్నాడు.

నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం  నర్తవాడ పంచాయతీ వడ్డిపాళెం గ్రామానికి చెందిన విరిగినేని మహేశ్వరరావు నేడు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేస్తూ.. తమ గ్రామంలో వైసీపీ నాయకుడు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి జామాయిల్ సాగుచేస్తున్నాడని.. అతడు వెంగమాంబ దేవస్థానం ట్రస్టీగా ఉండి చేసిన అవినీతి వలన తొలగించబడినాడని... అతని చెర నుండి ప్రభుత్వ భూమిని విడిపించాలని మహేశ్వరరావుతోపాటు గ్రామస్తులు నేతలను కోరారు.

నెల్లూరు జిల్లా నెల్లూరు టౌన్ కు చెందిన ఇరగల శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేస్తూ.. అప్పులు తెచ్చి ఇచ్చిన సరుకులకు సంబంధించి తమకు రావాల్సిన డబ్బులను అడుగుతుంటే సజ్జల రామకృష్ణారెడ్డి తన ఫ్రెండ్ మరియు బంధువు అని చెబుతూ తమపై అక్రమ కేసులు పెట్టించి తమను చంపాలని కొల్లు నరసింహారెడ్డి చూస్తున్నాడని తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని శ్రీనివాసరెడ్డి నేతల ముందు వాపోయాడు.

శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం టి. సదుగాం గ్రమాని చెందిన చలపతి.. నేతలను వేడుకుంటూ.. తన భూమి 2.14 సెంట్లను గ్రామానికి చెందిన గౌడ చెరువు రమణారెడ్డి ఆక్రమించాడని..  తన కుటుంబానికి ఆ భూమే ఆధారమని.. తమ భూమి కబ్జా నుండి విడిపించి న్యాయం చేయాలని వేడుకున్నాడు. 

పల్నాడు జిల్లా మాచర్ల మండలం రాయవరం గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ల ఆంజనేయులు విజ్ఞప్తి చేస్తూ.. సర్వే నెంబర్. 6.43 లో ఉన్న 7ఎకరాల49 సెంట్ల దేవాదాయశాఖ భూమిని తనకు లీజుకు ఇవ్వాలని 2019 లో అర్జీ పెట్టుకోని.. మాచర్ల ఈఓ కృష్ణమూర్తికి రూ.40,000 చెల్లించాక.. అనంతరం వైసీపీ అధికారంలోకి రావడంతో ఆపార్టీకి చెందిన వైసీపీ నేత తురక కిషోర్ టీడీపీ వాళ్లకు ఎటువంటి పొలం ఇచ్చేది లేదని బెదిరించి బూతులు తిట్టాడని.. ఈవిషయాన్ని పులు మార్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని.. తనకు తిరిగి ఆ పొలం లీజుకు ఇప్పించి న్యాయం చేయాలని వేడుకున్నాడు.

అన్నమయ్య జిల్లా పీటీఎం మండలం శోత్రియం జగడంవారిపల్లి గ్రామంలో తమకు చెందిన భూమిని తహశీల్దార్ మరియు మండల సర్వేయర్ మరోకరి పేరుపైకి మార్చారని బొంతలవారిపల్లికి చెందిన గూడె పాపిరెడ్డి నేడు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశాడు.

పెద్ద తిప్ప సముద్రమండలానికి చెందిన గుడె శివరామరెడ్డి, గుడె మంజునాథ్ రెడ్డిలు నేడు గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేస్తూ.. రాజకీయ నాయకుల ప్రోద్భలంతో లంచం తీసుకొని డిప్యూటీ తహశీల్దార్, మండల సర్వేయర్, ఇన్ఛార్జ్ తహశీల్దార్లు అక్రమార్కులతో  కుమ్మక్కై తమ భూమిని కొట్టేశారని... ఈ విషయంపై రికార్డులను పరిశీలించి కబ్జాదారులకు సహకరించిన అధికారులను శిక్షించి తమకు న్యాయం చేయాలని వారు గ్రీవెన్స్ లో వేడుకున్నారు. 

అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం లేవాకువారు పల్లెలో ఉన్న తమ పొలంలో వైసీపీ నేతలు మట్టిని తవ్వేశారని..  అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని తమకు న్యాయం చేయాలని  నాగినేని వెంకటసుబ్బయ్య నాయుడు గ్రీవెన్స్ లో వేడుకున్నాడు.

నెల్లూరు జిల్లా కొండాపురం మండలం మర్రికుంట గ్రామానికి చెందిన మాల్యాద్రి అర్జిని ఇస్తూ.. నెల్లూరు శివారు ఏఎస్ పేట మండలం శిరమన గ్రామంలో 2 ఎకరాల 37 సెంట్లు దాడి శెట్టి వెంకటేశ్వర్లు తాను కలిసి కొని జాయింట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని చెప్పాడు. కాగా ప్రస్తుతం తన భాగాన్ని కూడా దాడిశెట్టి వెంకటేశ్వర్లు తన కొడుకుల పేర్లపై ఆన్ లైన్ లో ఎక్కించాడని.. తనకు న్యాయం చేయాలని మాల్యాద్రి గ్రీవెన్స్ లో వేడుకున్నాడు. 


పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం కనుమల చెరువు గ్రామానికి చెందిన కేతావతు కుమారి బాయి విన్నవించుకొంటూ.. ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ఇంటర్యూలో తన విద్యార్హత కుల రిజర్వేషన్ ప్రాతిపదికన తనకు అంగన్ వాడీ టీచర్ పోస్ట్ ఇచ్చారని. విధులు నిర్వహించుటకు అంగన్వాడీ కేంద్రం కు వెళ్లగా వైసీపీ పార్టీకి చెందిన నాయకుడు తమ్మినేని ఆదిరెడ్డి తనను జుట్టుపట్టుకుని కొట్టి అంగన్ వాడీ కార్యాలయం 20 రోజులు మూయించి తన భార్యకు అంగన్ వాడీ పోస్ట్ ను వచ్చేలా చేశాడని.. అతనిపై చర్యలు తీసుకోని అంగన్ వాడి పోస్ట్ ను ఇప్పించాలని కుమారిబాయి గ్రీవెన్స్ లో వేడుకొంది. 

ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్ గా పనిచేస్తోన్న వ్యక్తి ప్రభుత్వ భూములను అక్రమంగా తన భార్య పేరుమీద ఎక్కించుకోవడమే కాకుండా తాను సాగు చేసుకుంటున్న భూమిని కబ్జా చేయాలని చూస్తున్నాడని.. అంతేకాకుండా  చంపుతానని బెదిరిస్తోన్నాడని.. వెలగచెర్ల గ్రామానికి చెందిన అనుగోలు దామోదర్ పై చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలానికి చెందిన కొప్పుల వెంకటరమణ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశాడు. 


దళితుల అభివృద్ధికి 1987 లో ప్రభుత్వం ఇచ్చిన భూములు నేటికి తమ పేర్లపై ఆలన్ లైన్ కాలేదని దాంతో ప్రభుత్వం నుండి వచ్చే ఫలాలు అందడంలేదని.. కావున పట్టాదారుల భూముల వివరాలు ఆన్ లైన్ లో ఎక్కించి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు మంజూరు చేయాలని రాజంపేట మండలం ఆకేపాడు గ్రామానికి చెందిన పలువురు విజ్ఞప్తి చేశారు.
గత ప్రభుత్వంలో తమకు అన్యాయంగా పింఛన్ లు తొలగించారంటూ నేడు లబ్ధిదారులు గ్రీవెన్స్ కు పోటెత్తారు. వారిలో వృద్ధులు, వికాలాంగులు అధికంగా ఉన్నారు. తమకు పింఛన్లు ఇచ్చి ఆదుకోవాలని వేడుకొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios