Asianet News TeluguAsianet News Telugu

మోడీ అఖిలపక్షానికి టీడీపీ లేఖ మాత్రమే

ఈ నెల 19వ తేదీన కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఆల్ పార్టీ మీటింగ్‌కు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది.
 

tdp decides to not attend allparty meeting on june 19
Author
Amaravathi, First Published Jun 18, 2019, 6:01 PM IST

అమరావతి: ఈ నెల 19వ తేదీన కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఆల్ పార్టీ మీటింగ్‌కు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది.

జమిలీ ఎన్నికలు నిర్వహించే విషయమై  కేంద్రం మంగళవారం నాడు అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు.  
ఈ సమావేశానికి హాజరుకావాలని  కేంద్రం అన్ని రాజకీయ పార్టీలకు లేఖలను పంపింది.  అయితే ఈ సమావేశానికి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది.

ఈ సమావేశంలోని ఎజెండా అంశాలపై తమ పార్టీ అభిప్రాయాలను టీడీపీ లేఖ ద్వారా  పంపనుంది.జమిలీ ఎన్నికలు నిర్వహించే విషయమై రాజ్యాంగ, న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని టీడీపీ కేంద్రాన్ని కోరనుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios