భువనేశ్వరిని ఆశీర్వదించండి ... త్వరలోనే బయటికొస్తా : తెలుగు ప్రజలకు చంద్రబాబు లేఖ
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో వున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం జైలు నుంచి తెలుగు ప్రజలకు లేఖ రాశారు.

స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో వున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం జైలు నుంచి తెలుగు ప్రజలకు లేఖ రాశారు. అందరికీ దసరా శుభాకాంక్షలు రాసిన ఆయన ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని స్పష్టం చేశారు. ఆలస్యమైనా న్యాయమే గెలుస్తుందని, త్వరలోనే బయటికొస్తానని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. తాను జైలులో లేనని.. ప్రజల హృదయాల్లో వున్నానని , ప్రజల నుంచి తనను ఒక్క క్షణం కూడా ఎవరూ దూరం చేయలేరని టీడీపీ చీఫ్ తెలిపారు. 45 ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న తన విలువలు, విశ్వసనీయతను ఎవరూ చెరిపివేయలేరని చంద్రబాబు స్పష్టం చేశారు.
తన రాజకీయ జీవితమంతా తెలుగు ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సాగిందని ఆయన తెలిపారు. ఓటమి భయంతో తనను జైలు గోడల మధ్య బంధించి ప్రజలకు దూరం చేయాలనుకుంటున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాను మీ మధ్య లేకపోయినా అభివృద్ధి రూపంలో ప్రతి చోటా కనిపిస్తూనే వుంటానని ఆయన పేర్కొన్నారు. కుట్రలతో తనపై అవినీతి ముద్ర వేయాలని ప్రయత్నించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యం అనే సూర్యుడి ముందు కారు మబ్బులు వీడిపోతాయని.. సంకెళ్లు తన సంకల్పాలన్ని బంధించలేవని, జైలు గోడలు నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవని టీడీపీ అధినేత స్పష్టం చేశారు. తను తప్పు చేయను, చేయనివ్వనని ఆయన పేర్కొన్నారు.
ఇకపోతే.. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా ఇప్పటికే టిడిపి శ్రేణులు వివిధ రకాల ఆందోళనలు చేపట్టారు. చంద్రబాబును వైసిపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కక్షగట్టాడని... అందుకోసమే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయించాడని ప్రజలకు వివరించేందుకు మరిన్ని నిరసన కార్యక్రమాలకు సిద్దమయ్యింది. వినూత్న నిరసనలు చేపడుతూ వీలైనంత ఎక్కువమంది ఇందులో పాల్గొనే ఏర్పాట్లు చేస్తోంది. ఇలా దసరా పండగపూట కూడా ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తూ సీఎం జగన్ కు వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని టిడిపి శ్రేణులకు పిలుపునిచ్చాడు నారా లోకేష్.
ALso Read: ఈ దసరాకు 'జగనాసుర దహనం' చేద్దాం..: నారా లోకేష్ పిలుపు
ఇటీవల గాంధీ జయంతి రోజున సత్యమేవ జయతే పేరిట ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టినట్లు దసరా పండగ పూట కూడా నిరసనలు సిద్దమవుతోంది టిడిపి. దసరా రోజున రావణదహనం చేయడం సాంప్రదాయం... కానీ ఈసారి జగనాసుర దహనం కూడా చేయాలని టిడిపి నిర్ణయించింది. ''దేశం చేస్తోంది రావణాసుర దహనం - మనం చేద్దాం జగనాసుర దహనం'' పేరిట నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చంద్రబాబు తనయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
దసరా పండగరోజున అంటే అక్టోబర్ 23న రాత్రి 7 గంటల నుండి 7.05 నిమిషాల వరకు టిడిపి శ్రేణులు వీధుల్లోకి రావాలని లోకేష్ సూచించారు. 'సైకో పోవాలి' అన్ని నినాదాలు రాసిన పత్రాలను చేతబట్టి వైఎస్ జగన్, వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయాలని సూచించారు. అనంతరం ఆ పత్రాలను దహనం చేయాలన్నారు. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేయాలని లోకేష్ సూచించారు.
జగన్ అనే రాక్షసుడు చెడుకు సూచికగా వుంటే... చంద్రబాబు నాయుడు మంచికి సూచికగా వున్నారన్నారు. కాబట్టి తాత్కలికంగా చెడుదే ఆధిక్యంగా కనిపించినా చివరకు గెలిచేది మంచేనని... ఇదే దసరా పండగ సందేశమని లోకేష్ అన్నారు. కాబట్టి జగన్ పై కూడా చంద్రబాబు విజయం సాధిస్తుందని... ముందుగానే పండగని సెలబ్రేట్ చేసుకుందామని నారా లోకేష్ అన్నారు.