Asianet News TeluguAsianet News Telugu

37 రోజుల పసికందు అనుమానాస్పద మృతి.. ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి మూతపెట్టి...దారుణం..(వీడియో)

నిన్న రాత్రి తల్లిదండ్రుల దగ్గర పడుకున్న పసికందు తెల్లవారేసరికి ఇంట్లోనే ఓ ప్లాస్టిక్ డ్రమ్ములో శవమై కనిపించాడు. అయితే డ్రమ్ము కూడా మూత వేసి ఉండడంతో ఇది హత్యగా అనుమానిస్తున్నారు. పసికందు తల్లిదండ్రులు అప్పలరాజు, సంధ్య కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో కావాలనే తమ చిన్నారి మీద ఇలా అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Suspicious death of 37-day-old infant in vishakapatnam
Author
Hyderabad, First Published Nov 27, 2021, 2:01 PM IST

విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. 37 రోజుల పసికందు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నిన్న రాత్రి తల్లిదండ్రుల దగ్గర పడుకున్నinfant తెల్లవారేసరికి కనబడకపోవడంతో తల్లిదండ్రులు తీవ్రంగా గాలించారు. చివరకు ఇంట్లోనే ఓ Plastic drumలో పసికందు శవమై కనిపించాడు. 

"

అయితే డ్రమ్ము కూడా మూత వేసి ఉండడంతో ఇది హత్యగా అనుమానిస్తున్నారు. పసికందు తల్లిదండ్రులు అప్పలరాజు, సంధ్య కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో కావాలనే తమ చిన్నారి మీద ఇలా అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

వీరిది love marriage. అప్పలరాజు, సంధ్య ఒకరినొకరు ఘాడంగా ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమకు పెద్దలు నిరాకరించారు. దీంతో పెద్దలను ఎదురించి యేడాది కిందట వీరు వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో చిన్నారి చనిపోవడంతో వీరు ఎవరో కావాలనే చేశారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 


ఇదిలా ఉండగా అక్టోబర్ లో ఇలాంటి దారుణ ఘటనే గుంటూరులో చోటు చేసుకుంది.  Guntur జిల్లాలోని ప్రభుత్వ hospital నుంచి మూడు రోజుల పసికందును దుండగులు kidnap చేశారు. గుంటూరు జీజీహెచ్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది.

గుంటూరు సమీపంలోని పెదకాకానికి చెందిన ప్రియాంక ఈ నెల 12న జీజీహెచ్ ఆస్పత్రిలో ప్రసవించారు. ప్రియాంకకు బాలుడు జన్మించాడు. ఆ శిశువును తాత, అమ్మమ్మలు చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే 15వ తేదీ అర్ధరాత్రి దాటాక సుమారు 1.30 గంటల ప్రాంతంలో బాబును వార్డు బయటకు తీసుకువచ్చారు. అక్కడే కాసేపు ఆడించారు. అనంతరం బాబును పక్కనే ఉంచుకుని నిద్రపోయారు.

ఇదే అదనుగా కొందరు దుండగులు తమ పథకం అమలు చేశారు. ఆ వృద్ధుల పక్కనే పడుకున్న శిశువును గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళ్లినట్టు అనుమానిస్తున్నారు. కాసేపటికి మెలకువకు వచ్చిన ఆ ముసలివాళ్లు పక్కన బాబు లేకపోవడంతో హతాశయులయ్యారు. వెంటనే జీజీహెచ్ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

సుఖాంతమైన మూడు రోజుల పసికందు కిడ్నాప్.. తల్లి ఒడికి బాలుడు.. (వీడియో)

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అనంతరం ఓ ఇద్దరు అనుమానితులను గుర్తించారు. ప్రస్తుతం ఆ ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. శిశువు అదృశ్యంతో పెదకాకానికి చెందిన తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

సెప్టెంబర్ లో జరిగిన ఇలాంటి మరో ఘటనలో అభం శుభం తెలియని ఓ చిన్నారి పాలిట మేనమామ కంసుడిలా మారాడు. లోకం తెలియని ఆ పసికందుకు కర్కశంగా గొంతు నులిచి చంపేశాడు. ఈ సంఘటన క్రిష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం రుద్రవరంలో చోటు చేసుకుంది. నాలుగు నెలల పసికందుకు వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి గొంతునులిమి హత్య చేశాడు. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో ఆ వ్యక్తి మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడి గట్టాడా? లేదా స్థల వివాదాలు కారణమా? అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న రెడ్డిగూడెం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios