మిషన్ బిల్డ్ ఏపీ కేసు : జస్టిస్ రాకేష్ కుమార్ ఉత్తర్వులపై సుప్రీం స్టే..
మిషన్ బిల్డ్ ఏపీ కేసులో రిటైర్మెంటుకు ముందురోజు జస్టిస్ రాకేష్ కుమార్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. పదవీ విరమణకు ఒక్కరోజు ముందు జస్టిస్ రాకేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు, తీర్పుపై స్టే విధిస్తూ బుధవారం దేశ అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
మిషన్ బిల్డ్ ఏపీ కేసులో రిటైర్మెంటుకు ముందురోజు జస్టిస్ రాకేష్ కుమార్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. పదవీ విరమణకు ఒక్కరోజు ముందు జస్టిస్ రాకేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు, తీర్పుపై స్టే విధిస్తూ బుధవారం దేశ అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
తీర్పు నేపథ్యంలో జస్టిస్ రాకేష్ కుమార్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేవ్ లో ఏకంగా రాజ్యాంగ విచ్చిన్నం జరిగిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు విస్మయానికి గురి చేశాయి.
ఆ తర్వాత ఆ వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయాలుగా న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. కాగా డిసెంబర్ 30న తీర్పు ఇచ్చి, డిసెంబర్ 31న జస్టిస్ రాకేష్ పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా? అన్న అంశంమీద తేలుస్తామంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ అప్పీల్ దాఖలు చేసింది. రాజ్యాంగం వైఫల్యంపై అధికరణ 356 కింద రాష్ట్రపతి జోక్యం చేసుకోవచ్చే కానీ న్యాయస్థానాలు కాదని రాష్ట్ర ప్రభుత్వం తన అప్పీల్లో పేర్కొంది.
హైకోర్టు ఆదేశాలు ఏ మాత్రం సబబు కాదని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు నివేదించారు. హెబియస్ కార్పస్ పిటిషన్లలో రాజ్యాంగ వైఫల్యంపై విచారణ జరుపుతామన్న హైకోర్టు ఉత్తర్వులు హేతుబద్ధంగా లేవని అన్నారు.
ఈ అప్పీల్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కేసు పూర్వాపరాలను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం అక్టోబర్ 1న అక్టోబర్ 1న హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధిస్తున్నట్లు స్పష్టం చేసింది.
హైకోర్టు ఆదేశాలు ఆందోళనకరంగా ఉన్నాయంటూ గంలోనే న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తమ వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ కొందరు హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేస్తే ఆ వ్యాజ్యాల్లో ఓ న్యాయస్థానం ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం ఎప్పుడైనా, ఎక్కడైనా మనం చూశామా? అంటూ విస్మయం వ్యక్తం చేసింది.
రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని ఆ న్యాయమూర్తులు భావించడనాకి అంతగా ప్రభావితం చేసిన అంశాలేమున్నాయో అంతు బట్టడం లేదని వ్యాఖ్యానించింది.