ఏపీలోని బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఆదివారం నిర్వహించిన సిద్ధం సభలో అపశృతి జరిగింది. ఈ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఒకరు మరణించారు.
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదివారం నిర్వహించిన సిద్ధం సభలో అపశ్రుతి జరిగింది. బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. మృతుడిని ఒంగోలు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసే ఉదరగుడి మురళిగా అధికారులు గుర్తించిన్నట్టు తెలుస్తోంది. ఆయనకు 30 సంత్సరాల వయస్సు ఉంటుందని సమాచారం.
ఉక్రెయిన్ పై రష్యా అణుదాడిని ఆపడంలో భారత్ ది కీలక పాత్ర - సీఎన్ఎన్ రిపోర్ట్
సిద్ధం కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైంది. రెండు గంటల పాటు సాగింది. ఆరు గంటలకు ఈ సభ ముగిసింది. సీఎం వైఎస్ జగన్ ప్రసంగం తరువాత ఈ కార్యక్రమం నుంచి జనాలు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో గేటు దగ్గర ఒక్క సారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇందులో మురళికి తీవ్ర గాయాలు కావడంతో ఆయన మరణించాడు.
మూడు పిల్లర్లకు రిపేర్ చేయించే సత్తా రేవంత్ రెడ్డికి లేదా ? - కేటీఆర్
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు మొదలు పెట్టారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
