శ్రీకాకుళం జిల్లా గూనపాలెంలో దారుణంలో చోటుచేసుకుంది. పట్టపగలే నడిరోడ్డుపై ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. హత్యకు గురైన వ్యక్తిని కరుణరాజ్‌‌గా గుర్తించారు. 

శ్రీకాకుళం జిల్లా గూనపాలెంలో దారుణంలో చోటుచేసుకుంది. పట్టపగలే నడిరోడ్డుపై ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. హత్యకు గురైన వ్యక్తిని కరుణరాజ్‌‌గా గుర్తించారు. వివరాలు.. గూనపాలెంలో కరుణరాజ్‌తో పాటుగా మరో వ్యక్తి హరిపై శనివారం మధ్యాహ్నం ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో కరుణ్ రాజ్ అక్కడికక్కడే మృతిచెందాడు. హరికి తీవ్ర గాయాలు కావడంతో.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

కరుణ‌రాజ్ అనే వ్యక్తి గూనపాలెం సచివాలయంలో వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. కరుణరాజ్ ఇంటి సమీపంలోనే ఈ ఘటన జరిగింది. కరుణరాజ్ దారుణ హత్యకు గురికావడంతో.. అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.