మీ హయాంలో హైదరాబాద్ అభివృద్ది.. నేను ప్రత్యక్షంగా చూశా: బాబుపై సోనూసూద్ ప్రశంసలు
కరోనా వేళ ఆపద్భాందవుడిగా మారిన సినీనటుడు సోనూసూద్కు అన్ని వర్గాల్లోనూ క్రేజ్ పెరుగుతోంది. ఆయనను అభినందిస్తూ సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ మంత్రి కేటీఆర్ అయితే సోనూసూదే నిజమైన స్టార్ అంటూ ప్రశంసించారు. ఇక నటుడు బ్రహ్మాజీ అయితే సోనూసూద్కి పద్మవిభూషణ్ ఇవ్వాలంటూ ప్రతిపాదన చేశారు కూడా.
కరోనా వేళ ఆపద్భాందవుడిగా మారిన సినీనటుడు సోనూసూద్కు అన్ని వర్గాల్లోనూ క్రేజ్ పెరుగుతోంది. ఆయనను అభినందిస్తూ సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ మంత్రి కేటీఆర్ అయితే సోనూసూదే నిజమైన స్టార్ అంటూ ప్రశంసించారు. ఇక నటుడు బ్రహ్మాజీ అయితే సోనూసూద్కి పద్మవిభూషణ్ ఇవ్వాలంటూ ప్రతిపాదన చేశారు కూడా.
తాజాగా సోనూసూద్ను ప్రశంసించారు ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కరోనా విజృంభణ నేపథ్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రతినిధులు, పలు రంగాల నిపుణులతో అధినేత చంద్రబాబు వర్చువల్ పద్ధతిలో మాట్లాడారు. ఇందులో పాల్గొన్న సోనూసూద్ మాట్లాడుతూ... తనకు అర్థరాత్రి సమయంలో కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు. తనకు వీలైనంత సాయం చేస్తున్నానని తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో సేవ చేయడాన్ని బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు. తన భార్య ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తికావడం సంతోషమని సోనూసూద్ వ్యాఖ్యానించారు. తనకు తెలుగు రాష్ట్రాలతో ఆత్మీయ అనుబంధం ఉందని.. ఏపీ, తెలంగాణలు తనకు రెండో ఇల్లు వంటివని సోనూసూద్ చెప్పారు.
Also Read:సోనూసూద్కి పద్మ అవార్డు కోరిన బ్రహ్మాజీ.. రియల్ హీరో రియాక్షనేంటో తెలుసా?
తాను హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడి పాత్రను ప్రత్యక్షంగా చూశానని సోనూసూద్ గుర్తుచేసుకున్నారు. అప్పట్లో చంద్రబాబు హైదరాబాద్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని వెల్లడించారు. ఆ నగర అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర గొప్పదని.. కరోనాపై పోరాటంలో తామిద్దరి ఆలోచనలు కలవడం సంతోషమని సోనూసూద్ వెల్లడించారు.