గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 30 మందికి పైగా మృతి చెందిన ఘటనపై సోమయాజులు కమిషన్ నివేదికను బుధవారం నాడు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది
అమరావతి: గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 30 మందికి పైగా మృతి చెందిన ఘటనపై సోమయాజులు కమిషన్ నివేదికను బుధవారం నాడు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. తొక్కిసలాటకు సీఎం కారణం కాదని కమిషన్ ఈ నివేదిక అభిప్రాయపడింది.
2015 జూలై 15 వ తేదీన గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని రాజమండ్రిలోని పుష్కరఘాట్లో తొక్కిసలాట జరిగింది.ఈ తొక్కిసలాటలో సుమారు 30 మందికి పైగా మృతి చెందారు.
ఈ ఘటనపై ఆనాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. గోదావరి పుష్కరాల తొక్కిసలాటకు చంద్రబాబునాయుడే కారణంగా విమర్శలు గుప్పించారు.. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం సోమయాజులు కమిషన్ ను ఏర్పాటు చేసింది. సోమయాజులు కమిషన్ ఈ ఘటనపై పూర్తిగా విచారణ చేసింది.
ఆనాడు చోటు చేసుకొన్న పరిణామాలపై ప్రత్యక్షసాక్షులు అధికారులను విచారించింది. మరో వైపు టెక్నాలజీ సహాయాన్ని కూడ తీసుకొని ఈ ఘటనపై నివేదికను అందించింది.ఒకే ముహుర్తానికి స్నానం చేయాలనే పిచ్చి నమ్మకం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని సోమయాజులు కమిషన్ అభిప్రాయపడింది. పుష్కరఘాట్ వెడల్పు కూడ 300 మీటర్లు మాత్రమే ఉన్న విషయాన్ని ఆయన తన నివేదికలో ప్రస్తావించారు.
మరోవైపు చంద్రబాబునాయుడు పుష్కరఘాట్ నుండి వెళ్లిపోయిన తర్వాతే ఈ ప్రమాదం చోటు చేసుకొందని సోమయాజులు కమిషన్ నివేదికలో స్పష్టం చేసింది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Sep 19, 2018, 11:40 AM IST