Asianet News TeluguAsianet News Telugu

గోదావరి పుష్కరాల తొక్కిసలాటపై తేల్చేసిన కమిషన్

గోదావరి పుష్కరాల సందర్భంగా  జరిగిన తొక్కిసలాటలో 30 మందికి పైగా మృతి చెందిన ఘటనపై సోమయాజులు  కమిషన్  నివేదికను  బుధవారం నాడు  ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది

somayajulu commission report submitted to assembly
Author
Amaravathi, First Published Sep 19, 2018, 11:34 AM IST

అమరావతి: గోదావరి పుష్కరాల సందర్భంగా  జరిగిన తొక్కిసలాటలో 30 మందికి పైగా మృతి చెందిన ఘటనపై సోమయాజులు  కమిషన్  నివేదికను  బుధవారం నాడు  ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. తొక్కిసలాటకు  సీఎం  కారణం కాదని కమిషన్ ఈ నివేదిక అభిప్రాయపడింది.

2015 జూలై 15 వ తేదీన గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని రాజమండ్రిలోని పుష్కరఘాట్‌లో తొక్కిసలాట జరిగింది.ఈ తొక్కిసలాటలో సుమారు 30 మందికి పైగా  మృతి చెందారు.

ఈ ఘటనపై  ఆనాడు  ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. గోదావరి పుష్కరాల తొక్కిసలాటకు  చంద్రబాబునాయుడే కారణంగా  విమర్శలు గుప్పించారు.. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం  సోమయాజులు కమిషన్ ను ఏర్పాటు చేసింది. సోమయాజులు కమిషన్ ఈ ఘటనపై పూర్తిగా విచారణ చేసింది.

ఆనాడు చోటు చేసుకొన్న పరిణామాలపై ప్రత్యక్షసాక్షులు అధికారులను విచారించింది. మరో వైపు టెక్నాలజీ సహాయాన్ని కూడ తీసుకొని  ఈ ఘటనపై నివేదికను అందించింది.ఒకే ముహుర్తానికి స్నానం చేయాలనే  పిచ్చి నమ్మకం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని సోమయాజులు కమిషన్  అభిప్రాయపడింది. పుష్కరఘాట్ వెడల్పు కూడ 300 మీటర్లు మాత్రమే ఉన్న విషయాన్ని  ఆయన తన నివేదికలో ప్రస్తావించారు.

మరోవైపు చంద్రబాబునాయుడు పుష్కరఘాట్ నుండి వెళ్లిపోయిన తర్వాతే  ఈ ప్రమాదం చోటు చేసుకొందని సోమయాజులు కమిషన్  నివేదికలో స్పష్టం చేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios