Asianet News TeluguAsianet News Telugu

విషాదం.. రూ.2 కోసం ఆరో తరగతి విద్యార్థి ఆత్మహత్య..!

పాకెట్ మనీ అడిగితే తల్లి ఇవ్వలేదని ఓ చిన్నారి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన అనంతపురంలో వెలుగు చూసింది. 

Sixth class student commits suicide for Rs.2 in Anantapur - bsb
Author
First Published Nov 1, 2023, 12:44 PM IST

అనంతపురం : ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం, కనగానపల్లిలో ఓ హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. రూ.2 కోసం ఓ ఆరో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయం స్కూలుకు వెడుతూ తల్లిని పాకెట్ మనీ రూ.2 ఇవ్వమని అడిగాడు. దీనికి తల్లి సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన ఆ చిన్నారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

ఇంట్లోనుంచి డబ్బులు తీసుకుని వచ్చిన తల్లి అది చూసి షాక్ అయ్యింది. డబ్బులు తీసుకుని వచ్చేలోపే కొడుకు ఈ దారుణానికి ఒడిగట్టాడని హృదయవిదారకంగా రోదిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios