ఉమ్మడి కృష్ణా జిల్లాలోని  సత్రపాలెంలో  ఆస్తి  గొడవల నేపథ్యంలో తమ్ముడి  చెవిని  కోశాడు  నిందితుడు.  కట్ చేసిన  చెవిని  పైశాచికంగా నమిలాడు.    

విజయవాడ:  ఉమ్మడి కృష్ణా జిల్లాలోని  సత్రపాలెంలో  ఆస్తి  గొడవల కారణంగా  తమ్ముడిపై దాడి చేశాడు అన్న.  అంతేకాదు   తమ్ముడి  చెవిని  కోసేశాడు. ఆ తర్వాత  చెవిని  నమిలాడు.  రోడ్డుపై  అందరూ  చూస్తుండగానే  చెవిని నమిలుతూ  తిరిగాడు.  చెవి తెగిన  బాధితుడిని  కుటుంబ సభ్యులు  ఆసుపత్రికి తరలించారు.  అయితే  చెవిని నమలడంతో  చికిత్స  చేయలేమని  వైద్యులు  చెప్పారు.  బాధితుడి  ఫిర్యాదు మేరకు  నిందితుడు సీతారామయ్యను  పోలీసులు అరెస్ట్  చేశారు.