Asianet News TeluguAsianet News Telugu

కర్నూల్‌లో దారుణం: మైనర్ బాలుడిపై నలుగురి లైంగిక దాడి, అస్వస్థత

కర్నూల్ జిల్లాలో మైనర్ బాలుడిపై లైంగిక దాడి చోటు చేసుకొంది. నలుగురు యువకులు మైనర్ బాలుడిపై లైంగిక దాడికి దిగారు. 

sexual assault on minor boy in kurnool district
Author
Kurnool, First Published Jan 30, 2020, 11:23 AM IST


కర్నూల్: కర్నూల్ జిల్లాలో దారుణం చోటు చేసుకొంది. కర్నూల్ జిల్లా ఆవుకు  పట్టణంలో 14 ఏళ్ల మైనర్ బాలుడిపై నలుగురు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ నలుగురు యువకుల లైంగిక దాడితో  మైనర్ బాలుడు అస్వస్థతకు గురయ్యాడు.  అస్వస్థతకు గురైన బాలుడిని కుటుంబసభ్యులు నిలదీస్తే అసలు విషయం వెలుగు చూసింది.

Also read:న్యాయం కోసం వచ్చిన యువతిపై అఘాయిత్యం.. ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్

కర్నూల్ జిల్లాలోని ఆవుకు పట్టణంలో ఈ దారుణం చోటుచేసుకొంది. మూడు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకొంది. అయితే బాలుడు అనారోగ్యానికి గురి కావడంతో ఆరా తీసిన కుటుంబసభ్యులకు ఈ విషయం  తెలిసింది.

బాధిత కుటుంబం  పోలీసులను ఆశ్రయించింది. వీరిలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. కర్నూల్ జిల్లా ఆవుకు పట్టణంలో ఎన్నికల సమయంలో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎన్నికల తర్వాత ఈ కార్యాలయం ఎవరూ ఉపయోగించడం లేదు. అయితే ఈ కార్యాలయంలో బుల్లెట్ రాజు, ప్రేమ్ కుమార్, రాజాతో పాటు మరో వ్యక్తి తరచూ ఇక్కడే గడిపేవారు.

మూడు రోజుల క్రితం ఆవుకు పట్టణానికి చెందిన 14 ఏళ్ల మైనర్ బాలుడికి డిన్నర్ ఇస్తామని చెప్పి ఈ కార్యాలయానికి తీసుకొచ్చారు. బాలుడిపై నలుగురు  లైంగిక దాడికి దిగారు. ఈ సమయంలో ఆ బాలుడు తీవ్రంగా బాధకు గురయ్యాడు. ఈ  తతంగాన్ని వారు సెల్‌పోన్‌లో రికార్డు చేశారు.

ఈ లైంగిక దాడితో ఆ బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ విషయమై కుటుంబసభ్యుులు బాలుడిని నిలదీస్తే అసలు విషయం వెలుగు చూసింది.  ఈ విషయమై  బాధితుడు ఇచ్చిన  సమాచారం మేరకు వారి కుటుంబసభ్యులు పోలీసులకు పిర్యాదు చేశారు.

పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.మరో ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  ఈ నలుగురు స్థానికంగా మైనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వీరిపై రౌడీషీట్ కూడ ఉన్నట్టుగా స్థానికులు చెబుతున్నారు.

  

Follow Us:
Download App:
  • android
  • ios