Asianet News TeluguAsianet News Telugu

పట్టపగలు అందరూ చూస్తుండగానే... రైలుకిందపడి సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య

 సచివాలయంలో ఉద్యోగం చేస్తున్న యువతి బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన విజయనగరంలోచోటుచేసుకుంది. 

secretariat women employee suicide at vijayanagaram
Author
Vijayanagaram, First Published Mar 21, 2021, 7:49 AM IST

విజయనగరం:  అందరూ చూస్తుండగానే ఓ యువతి రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం సమయంలో ఈ ఘోరం జరిగింది. బలవన్మరణానికి పాల్పడిన యువతి సచివాలయ ఉద్యోగిగా తెలుస్తోంది. 

రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నర్సీపట్నానికి చెందిన వెంకటరమణ-లక్ష్మి దంపతుల కూతురు రాజ్యలక్ష్మి విశాఖ సచివాలయంలో వెల్పేర్‌ అసిస్టెంట్‌గా పరిచేస్తోంది. ఆమె సోదరి మహాలక్ష్మి హైదరాబాద్ లో సీఏగా పని చేస్తోంది.  వ్యవసాయం చేసుకుని జీవనం సాగించే ఆ తల్లిదండ్రులకు ఇద్దరు కూతుర్లు మంచి ఉద్యోగాలు సాధించి సెటిలయ్యారన్న ఆనందం ఎక్కువకాలం నిలవలేదు. కూతురు రాజ్యలక్ష్మి విధులకు వెళుతున్నానని చెప్పి ఇంట్లోంచి బయటకు వచ్చి ఆత్మహత్య చేసుకుంది.  

శనివారం మద్యాహ్నం విజయనగరం రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాం పైకి చేరుకుంది రాజ్యలక్ష్మి. ఈ సమయంలోనే  ప్రశాంతి ఎక్స్ ప్రెస్ రావడంతో ఒక్కసారిగా పట్టాలపైకి దూకి రైలుకి ఎదురెళ్లి పట్టాలపై పడుకుంది. ప్రయాణికులు, రైల్వే సిబ్బంది అందరూ చూస్తుండగానే ఆమెపై నుండి రైలు దూసుకెళ్లింది. ఇలా రెప్పపాటులో అందరిఎదుటే రాజ్యలక్ష్మి ప్రాణాలు గాల్లో కలిసాయి. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్టుమార్తం నిమిత్తం తరలించారు. అనంతరం యువతి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ విషాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios