Asianet News TeluguAsianet News Telugu

శ్రీకాకుళం: చెరువులోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు... చిన్నారి మృతి (వీడియో)

తోటి విద్యార్థులతో కలిసి ఆనందంగా స్కూల్ కు వెళుతున్న ఓ చిన్నారి బస్సు ప్రమాదవశాత్తు చెరువులోకి దూసుకెళ్లడంతో మృత్యువాతపడ్డాడు. ఈ విషాదం శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. 

school bus slips into pond in srikakulam district
Author
Srikakulam, First Published Oct 20, 2021, 12:01 PM IST

శ్రీకాకుళం: విద్యార్థులను తీసుకువెళుతున్న స్కూల్ బస్సు ప్రమాదానికి గురయ్యింది. వేగంగా వెళుతుండగా ఒక్కసారిగా అదపుతప్పిన బస్సు రోడ్డుపక్కనున్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం ఓ విద్యార్థి మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... srikakulam district ఎచ్చెర్ల మండలం కొయ్యూరు పంచాయితీ నిమ్మవానిపేట గ్రామానికి చెందిన విద్యార్థుల కోసం ప్రతిరోజూ ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు వస్తుంటుంది. రోజూ మాదిరిగానే ఇవాళ(బుధవారం) కూడా స్కూల్ బస్సులో తమ పిల్లలను పంపించారు గ్రామస్తులు. అయితే ఇలా తమ పిల్లలు వెళ్లిన కొద్దిసేటికే ఆ తల్లిదండ్రులు దుర్వార్త వినాల్సి వచ్చింది.  

కమ్మపేట నుండి నిమ్మవానిపేటకు ఎనిమిది మంది విద్యార్థులతో తిరిగివెళుతున్న క్రమంలో school bus accident కి గురయ్యింది. వేగంగా వెళుతూ అదుపుతప్పిన బస్సు రోడ్డుపక్కనున్న చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో బస్సులోని చిన్నారుల్లో ఓ బాలుడు మృతిచెందినట్లు తెలుస్తోంది. మృతిచెందిన విద్యార్థిని మైలపల్లి రాజుగా గుర్తించారు. 

వీడియో

బస్సు ప్రమాదం జరిగిన వెంటనే గ్రామస్తులు అప్రమత్తమై చిన్నారులను కాపాడారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్రేన్ సాయంతో నీటిలోంచి బస్సును బయటకు తీయించారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకుని విద్యార్థుల వివరాలు సేకరించారు.  

బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. తమ పిల్లలు ఈ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఓ చిన్నారి  మృతిచెండంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  

  

Follow Us:
Download App:
  • android
  • ios