Asianet News TeluguAsianet News Telugu

ఆయేషా మీరా కేసుపై సత్యంబాబు: అమ్మను, చెల్లిని చంపేస్తామన్నారు

నా తల్లిని, చెల్లిని చంపేస్తామని బెదిరించి ఆయేషా మీరా హత్య కేసులో  నన్ను ఇరికించారని  సత్యంబాబు చెప్పారు.
 

satyam babu reacts on ayesha meera case
Author
Vijayawada, First Published Jan 18, 2019, 6:51 PM IST

విజయవాడ: నా తల్లిని, చెల్లిని చంపేస్తామని బెదిరించి ఆయేషా మీరా హత్య కేసులో  నన్ను ఇరికించారని  సత్యంబాబు చెప్పారు.

ఆయేషా మీరా హత్య కేసులో గతంలో శిక్షను అనుభవించిన సత్యంబాబును శుక్రవారం నాడు సీబీఐ అధికారులు ఐదు గంటల పాటు విచారించారు. ఈ విచారణ సమయంలో  సత్యం బాబు కొన్ని కీలకమైన అంశాలను వెల్లడించినట్టు సమాచారం.

ఆయేషా మీరా హత్య జరిగిన సమయంలో  అప్పట్లో విచారణ చేసిన పోలీసులు  తనను ఈ కేసులో ఇరికించారని సత్యం బాబు చెప్పారు. నా తల్లిని, చెల్లిని చంపేస్తామని బెదిరించారన్నారు. అంతేకాదు తనను కూడ ఎన్‌కౌంటర్ చేస్తామని కూడ భయపెట్టారని సత్యంబాబు చెప్పారు.

కొంతమంది  పోలీసు అధికారులు ప్రమోషన్ల కోసం కక్కుర్తిపడి తనను  ఈ కేసులో ఇరికించారని సత్యంబాబు ఆరోపించారు. కొంతమంది పోలీసులు ప్రమోషన్ల కోసం కక్కుర్తిపడి తనను ఈ కేసులో ఇరికించారని చెప్పారు.

సత్యంబాబును ఈ కేసులో మరోసారి ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నారని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు. సీబీఐ అధికారులు సత్యం బాబును విచారిస్తున్న విషయం తెలుసుకొన్న  గ్రామస్థులు  ఆయన ఇంటికి భారీగా చేరుకొన్నారు.

సంబంధిత వార్తలు

ఆయేషా మీరా కేసు: కోనేరు మనవడిని విచారిస్తున్న సీబీఐ

ఆయేషా మీరా హత్య కేసు.. మిమిక్రీతో నన్ను హంతకుడిని చేశారు: సత్యంబాబు

ఆయేషా మీరా కేసులో దారుణమైన ట్విస్ట్

అయేషా మీరా హత్య కేసు: సత్యంబాబును విచారిస్తున్న సిబిఐ

Follow Us:
Download App:
  • android
  • ios