Asianet News TeluguAsianet News Telugu

శబరిమలకు వెళ్లి ఏపీకి వస్తుండగా పల్టీ కొట్టిన వ్యాన్.. ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు

తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ అయ్యప్ప భక్తుడు మరణించాడు. మరో ఐదుగురు గాయపడ్డారు. శబరిమల ఆలయాన్ని దర్శించుకుని ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వస్తుండగా తమిళనాడులోని దిండిగల్‌లో ఈ ప్రమాదం జరిగింది. మృతుడిని 42 ఏళ్ల శ్రాములుగా గుర్తించారు.
 

sabarimala pilgrim dies as van overturns in tamilnadu before entering into andhra pradesh
Author
First Published Jan 3, 2023, 7:30 PM IST

హైదరాబాద్: అయ్యప్ప మాల వేసుకుని శబరిమలలో దేవుడికి మొక్కులు అప్పజెప్పి తిరిగి వస్తుండగా ఓ రోడ్డు ప్రమాదం సంభవించింది. 22 మంది శబరిమల భక్తులతో ఏపీకి బయల్దేరిన వ్యాన్ తమిళనడులోని దిండిగల్ జిల్లాలో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

కేరళలోని శబరిమల ఆలయాన్ని దర్శించుకుని భక్తులు ఆంధ్రప్రదేశ్‌కు తిరుగు పయానమైన తర్వాత ఈ ఘటన జరిగింది. వారి వ్యాన్ వేదసందూర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. కంట్రోల్ తప్పి పోయిన తర్వాత ఆ వ్యాన్ రోడ్డుపక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. 

Also Read: అయ్యప్ప నామస్మరణతో మార్మోగుతున్న శబరిమల... పోటెత్తిన అయ్యప్ప మాలధారులు

42 ఏళ్ల శ్రాములు నాయక్ స్పాట్‌లోనే మరణించాడు. మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని వేదసందూర్, దిండిగల్‌లోని ప్రభుత్వ హాస్పిటల్‌లకు తరలించారు. ఈ ఘటన పై కూంబురు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.

Follow Us:
Download App:
  • android
  • ios