Asianet News TeluguAsianet News Telugu

నెల్లూరులో ఆర్టీసీ బస్సు బోల్తా.. మహిళ మృతి, 34 మందికి గాయాలు..

నెల్లూరులో ఈ ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఆర్టీసీ బస్సు లారీని ఢీ కొట్టి లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ చనిపోగా, 34మందికి గాయాలయ్యాయి.

RTC bus overturns in Nellore, woman killed, more than 30 injured
Author
Hyderabad, First Published Mar 23, 2022, 1:58 PM IST

బుచ్చిరెడ్డిపాలెం :  nellore జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఈ ఉదయం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. 34 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆత్మకూరు నుంచి నెల్లూరు వెళ్తున్న Palle velugu bus నెల్లూరు-బళ్లారి రహదారిపై దామరమడుగు మఠం కాలనీ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. ఆ తర్వాత రోడ్డుపై నుంచి పదిహేను అడుగుల లోతులో ఉన్న పంట పొలాల్లోకి బోల్తా పడింది.

ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. క్షతగాత్రులను108 వాహనాల్లో నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తులో బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై ప్రసాద్ రెడ్డి తెలిపారు.

ఇదిలా ఉండగా, మంగళవారం నాడు Nellore  జిల్లాలో road accident జరిగింది. వరికుంటపాడు వద్ద పైవంతెన నుంచి car కిందపడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వరికుంటపాటు కోల్డ్ స్టోరేజ్ వద్ద వంతెన పై నుంచి కింద పడిన కారులో డ్రైవర్ సహా ముగ్గురు ఉన్నారు. 

ప్రమాదంలో పామూరుకు చెందిన వెంకటలక్ష్మమ్మ కారులోనే మృతిచెందారు. డ్రైవర్ తో పాటు మరో యువతికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉదయగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఘటన మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇక, Nellore వెంకటగిరిలో సోమవారం ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. Inter student చిగురుపాటి Jyothikaను ప్రేమించలేదనే కోపంతో చెంచుకృష్ణ అనే యువకుడు కత్తితో గొంతు కోశాడు. జ్యోతిక పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చెంచుకృష్ణను అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

చెంచుకృష్ణ కొంతకాలంగా ప్రేమించాలంటూ యువతి వెంటపడుతున్నాడు. దీనికి ఆ యువతి అంగీకరించకపోవడంతో నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని ఆ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.  ప్రేమించలేదని యువతి గొంతు Choked చేశాడు. వివరాల్లోకి వెడితే.. పట్టణంలోని కాలేజీమిట్టకు చెందిన చిగురుపాటి జ్యోతిని (17) గత కొంత కాలంగా ప్రేమించాలంటూ చెంచు కృష్ణ అనే యువకుడు వేధిస్తున్నాడు. 

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు యువకుడిని మందలించారు. దీంతో కోపం పెంచుకున్న యువకుడు ఇంట్లో నిద్రిస్తున్న జ్యోతిని చూసి నేరుగా ఇంటిలోకి జోరబడి చాకుతో గొంతు కోశాడు. గొంతు కోసి ఆ తరువాత నింపాదిగా వెళ్లి కల్లు తాగి ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. కాసేపటికి విషయం తెలుసుకున్న స్థానికులు తలుపులు పగులకొట్టి చెంచుకృష్ణను పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం చెంచు కృష్ణ పోలీసులు అదుపులో ఉన్నాడు. యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios