Asianet News TeluguAsianet News Telugu

పట్టపగలే ట్రైన్ దోపిడీ... మహిళా గార్డ్ ను బెదిరించి నగలు అపహరణ

సిగ్నల్ కోసం ఆగిన సమయంలో ట్రైన్ లోకి ప్రవేశించిన దుండగులు మహిళా గార్డును బెదిరించి బంగారు ఆభరణాలు దోచుకున్నారు.

robbery at goods train in thadepalli
Author
Thadepalli, First Published Mar 31, 2021, 1:31 PM IST

తాడేపల్లి: ఆంధ్ర ప్రదేశ్ లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. సిగ్నల్ కోసం ఆగిన సమయంలో ట్రైన్ లోకి ప్రవేశించిన దుండగులు మహిళా గార్డును బెదిరించి బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ఈ ఘటన తాడేపల్లి  కృష్ణా కెనాల్ రైల్వే జంక్షన్ సమీపంలో చోటుచేసుకుంది.  

విజయవాడ నుంచి బిట్రగుంట వెళ్తున్న గూడ్స్ రైలు తాడేపల్లి కృష్ణా కెనాల్ జంక్షన్ సమీపంలో సిగ్నల్ కోసం ఆగింది. ఈ సమయంలో రైలు వెనుక భాగంలో ఉన్న గార్డ్ పెట్టెలోకి ప్రవేశించిన దుండగులు ఒంటరిగా ఉన్న మహిళా గార్డ్ ను బెదిరించారు. దీంతో బయపడిపోయాన ఆమె ఒంటిపై వున్న బంగారు ఆభరణాలను తీసిచ్చింది. వీటిని తీసుకున్న దుండగులు రైలు కదలగానే పరారయ్యారు. 

ఈ దోపిడీపై తాడేపల్లి కృష్ణా కెనాల్ రైల్వే జంక్షన్ లో ఆర్పీఎఫ్ పోలీసులకు బాధిత రైల్వే గార్డు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దొంగతనానికి పాల్పడింది గంజాయి, బ్లేడ్ బ్యాచ్ గా అనుమానిస్తున్నారు రైల్వే పోలీసులు.

 

Follow Us:
Download App:
  • android
  • ios