Asianet News TeluguAsianet News Telugu

కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... 8మంది మహిళల పరిస్థితి విషమం

 కర్నూలు జిల్లా డోన్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

road accident at kurnool dist
Author
Kurnool, First Published Jun 20, 2020, 12:23 PM IST

 కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డోన్ పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా నేషనల్ హైవేపై ఎదురెదురుగా వచ్చిన లారీ, ఆటో డీకొన్నారు. ఈ ప్రమాద సమయంలో ఆటోలో 10 మంది ప్రయాణికులు వున్నారు. వీరందరూ తీవ్ర గాయాలపాలైనట్లు సమాచారం. 

ఈ ప్రమాదంలో గాయపడిని వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని మెరుగైన వైద్యం కోసం కర్నూల్ కు తరలించారు. ఇందులో ఒ చిన్నారి కూడా వున్నట్లు తెలుస్తోంది. 

read more   సుశాంత్ సూసైడ్: భరించలేక తెలుగు అభిమాని ఆత్మహత్య

డోన్ పక్కన మల్లంపల్లె గ్రామానికి చెందిన పొదుపు గ్రూపు మహిళలు ఆటోలు బ్యాంక్ కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వారందరు మహిళలే వుండగా అందులో ఓ చిన్నారి కూడా వుంది. వీరంతా తీవ్ర గాయాలతో పడివుండటాన్ని గమనించిన స్థానికులు వారిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. 

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం లారీ డ్రైవర్ పరారీలో వున్నట్లు తెలుస్తోంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios